News June 18, 2024
సిగ్నల్ పనిచేయకపోవడమే ప్రమాదానికి కారణమా?

నిన్న బెంగాల్ రైలు ప్రమాద సమయంలో ఆటోమెటిక్ సిగ్నల్ వ్యవస్థ పనిచేయలేదని తెలుస్తోంది. తెల్లవారుజామున 5.30 గంటల నుంచి రాణిపత్ర-ఛత్తర్ హట్ స్టేషన్ల మధ్య సిగ్నల్ పడలేదని అధికారులు భావిస్తున్నారు. అటు రెండు రైళ్లు ఒకే లైన్పైకి వచ్చినప్పుడు ఆటోమెటిక్గా బ్రేక్ పడే వ్యవస్థ ‘కవచ్’ కూడా ఆ మార్గంలో అందుబాటులో లేదు. ఉంటే ప్రమాదం తప్పేదని అధికారులు చెబుతున్నారు.
Similar News
News January 18, 2026
నాన్వెజ్ వండేటపుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

వంటగదిలో ఎంత శుభ్రత పాటించినా.. బ్యాక్టీరియా, వైరస్లు విజృంభిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా నాన్వెజ్ వండేటపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మాంసాహారంపై ఉండే హానికర బ్యాక్టీరియా కిచెన్లో వృద్ధిచెంది మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి నాన్వెజ్ వండే ముందు, వండేటప్పుడు, వండిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మాంసాన్ని కడిగేటప్పుడు చేతులకు గ్లౌజ్లు వేసుకోవాలి. నాన్వెజ్ పాత్రలు విడిగా ఉంచాలి.
News January 18, 2026
ఐఐటీ ఢిల్లీలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

<
News January 18, 2026
కనకాంబరంలో ఎండు తెగులు నివారణ ఎలా?

కనకాంబరంలో ఎండు తెగులు ముఖ్యమైన సమస్య. ఈ తెగులు ఆశించిన కనకాంబరం మొక్క ఆకులు వాలిపోయి, ఆకు అంచు పసుపు రంగుకు మారుతుంది. వేర్లు, కాండం, మొదలు కుళ్లడం వల్ల మొక్క అకస్మాత్తుగా ఎండిపోతుంది. దీంతో మొక్కలు గుంపులుగా చనిపోతాయి. ఎండు తెగులు నివారణకు తెగులు ఆశించిన మొక్కల మొదళ్లు తడిచేలా.. లీటరు నీటికి మాంకోజెబ్ 2.5గ్రా. కలిపి.. ఒక్కో మొక్కకు 20-25 మిల్లీ లీటర్ల ద్రావణాన్ని పోయాలి.


