News January 11, 2025
అది యాడ్ or వార్నింగ్? PIA ఫొటోపై సెటైర్లు

నాలుగేళ్ల తర్వాత పారిస్కు విమానాలను ప్రారంభిస్తున్నామంటూ పాక్ ఎయిర్లైన్స్ చేసిన పోస్టు ట్రోల్కు గురవుతోంది. ‘పారిస్.. మేం వస్తున్నాం’ అంటూ ఐఫిల్ టవర్ వైపు విమానం దూసుకెళ్తున్నట్లుగా ఆ ఫొటో ఉంది. దీంతో ‘US ట్విన్ టవర్స్పై లాడెన్ దాడి తరహాలో ప్లాన్ చేశారా? అది ప్రకటనా? లేక వార్నింగా?’ అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 2020లో కరాచీలో విమానం క్రాష్ తర్వాత ఆ ఎయిర్లైన్స్ను EU బ్యాన్ చేసింది.
Similar News
News January 8, 2026
వాహనదారులకు అలర్ట్.. ఈ విషయం తెలుసా?

హెల్మెట్, లైసెన్స్ ఉంటే సరిపోదు మీ వాహనం అన్-సేఫ్ కండిషన్లో ఉన్నా భారీ ఫైన్ తప్పదనే విషయం మీకు తెలుసా? MV యాక్ట్-2019 ప్రకారం మీ బైక్/కారులో లోపాలున్నా భారీ ఫైన్ విధిస్తారు. మీ వాహన లోపాల వల్ల ఇతరులకు ప్రమాదం జరగొచ్చని చర్యలు తీసుకోవచ్చు. ఇండికేటర్ పని చేయకపోయినా రూ.5వేలు ఫైన్/ 3 నెలలు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. అందుకే మీ వాహనాన్ని ఓసారి చెక్ చేసుకోండి. SHARE IT
News January 8, 2026
బెండలో నీటి యాజమాన్యం, కలుపు నివారణ

బెండ విత్తనాలు విత్తిన వెంటనే నీరు పెట్టాలి. నల్లరేగడి నేలల్లో అయితే ప్రతి ఐదారు రోజులకు నీరు అందించాలి. పూత, కాయ దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. నీటి లభ్యత బాగా తక్కువగా ఉంటే బిందుసేద్యం విధానం అనుసరించడం మంచిది. పంటకాలంలో 3 నుంచి నాలుగుసార్లు కలుపు తీయాల్సి ఉంటుంది. విత్తనాలు వేసిన 2 వారాలకు కలుపు నియంత్రణ చర్యలు చేపట్టాలి. తర్వాత సమస్యను బట్టి కలుపును తొలగించుకోవాలి.
News January 8, 2026
YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందా?

AP: రాజధాని అంశం రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతోంది. అమరావతిపై <<18799615>>జగన్<<>> చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందనే చర్చ మొదలైంది. గతంలో తీసుకొచ్చిన 3 రాజధానుల ప్రతిపాదనను ఈసారి అమలు చేస్తారనే టాక్ విన్పిస్తోంది. మరోవైపు అమరావతికి చట్టబద్ధత తెస్తామని ప్రభుత్వం చెబుతోంది. కాగా ప్రభుత్వం మారితే APకి రాజధాని మారుతుందా?, శాశ్వత క్యాపిటల్ ఉండదా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.


