News January 11, 2025
అది యాడ్ or వార్నింగ్? PIA ఫొటోపై సెటైర్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736524547955_695-normal-WIFI.webp)
నాలుగేళ్ల తర్వాత పారిస్కు విమానాలను ప్రారంభిస్తున్నామంటూ పాక్ ఎయిర్లైన్స్ చేసిన పోస్టు ట్రోల్కు గురవుతోంది. ‘పారిస్.. మేం వస్తున్నాం’ అంటూ ఐఫిల్ టవర్ వైపు విమానం దూసుకెళ్తున్నట్లుగా ఆ ఫొటో ఉంది. దీంతో ‘US ట్విన్ టవర్స్పై లాడెన్ దాడి తరహాలో ప్లాన్ చేశారా? అది ప్రకటనా? లేక వార్నింగా?’ అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 2020లో కరాచీలో విమానం క్రాష్ తర్వాత ఆ ఎయిర్లైన్స్ను EU బ్యాన్ చేసింది.
Similar News
News January 16, 2025
తిరుమలలో విషాదం.. మూడేళ్ల బాలుడి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736942250988_695-normal-WIFI.webp)
AP: తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. బస్టాండ్ సమీపంలో పద్మనాభ నిలయం భవనంపై రెండో అంతస్తు నుంచి కింద పడి మూడేళ్ల బాలుడు మరణించాడు. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. స్వామివారి దర్శనం కోసం కడపకు చెందిన శ్రీనివాసులు ఫ్యామిలీతో తిరుమలలోని పద్మనాభ నిలయానికి వచ్చారు. అతని రెండో కుమారుడు సాత్విక్(3) ఆడుకుంటూ వెళ్లి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ మరణించాడు.
News January 16, 2025
హమాస్ చెరలో 100 మందికిపైగా బందీలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736940211783_1124-normal-WIFI.webp)
ఇజ్రాయెల్పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 250 మందిని కిడ్నాప్ చేయగా ఇప్పటికీ వీరిలో 100 మందికి పైగా బందీలుగానే ఉన్నారు. వీరిని విడుదల చేసేందుకు అంగీకారం కుదిరినా కనీసం మూడింట ఒక వంతు మంది ప్రాణాలతో లేరని సమాచారం. ఇదే నిజమైతే ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
News January 16, 2025
కాల్పుల విరమణ: కీలక ప్రత్యర్థులను హతమార్చిన ఇజ్రాయెల్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736968309111_1226-normal-WIFI.webp)
హమాస్కు కౌంటర్గా ఇజ్రాయెల్ చేసిన దాడిలో గాజా నగరం శిథిలాలుగా మారింది. ఈ 15 నెలల్లో ఇజ్రాయెల్పై దాడుల ప్రధాన సూత్రదారి అబ్దల్ హదీ సబా, ఆ గ్రూప్ పొలిట్ బ్యూరో సభ్యుడు కసబ్ను చంపేసింది. మరో సూత్రధారి యహ్యా సిన్వర్, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియేతో పాటు కీలక నేతలను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. మరోవైపు హమాస్కు సహకరించిన హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాతో పాటు ఆ గ్రూప్లోని కీలక నేతలను చంపేసింది.