News May 12, 2024
ప్రధాని రేసులో ఉన్నారా.. కేజ్రీవాల్ రియాక్షన్ ఇదే

లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీరిక లేకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇండియా కూటమి తరఫున ప్రధాని రేసులో ఉన్నారా అని కేజ్రీవాల్ను ప్రశ్నించగా.. తాను లేనని బదులిచ్చారు. కేంద్రంలో కూటమి అధికారంలోకి వస్తే ఆప్ గ్యారంటీలను అమలు చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.
Similar News
News February 7, 2025
ITలో అతిపెద్ద IPO.. 12న హెక్సావేర్ పబ్లిక్ ఇష్యూ

ఐటీ సంస్థ హెక్సావేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ రూ.8,750 కోట్ల సేకరణకు సిద్ధమైంది. ఈ నెల 12 నుంచి 14 వరకు ఐపీవో కొనసాగనుంది. బ్రాండ్ ధరను రూ.674-రూ.708గా ఫిక్స్ చేసింది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక రోజు ముందుగానే సబ్స్క్రిప్షన్ అందుబాటులోకి రానుంది. ఐటీ సెక్టార్లో ఇదే అతిపెద్ద ఐపీవో కావడం విశేషం. 20 ఏళ్ల కిందట TCS రూ.4,700 కోట్లు సమీకరించింది.
News February 7, 2025
మే, జూన్ నెలల్లో 2 పథకాల అమలు: మంత్రి కొలుసు

AP: తాము అధికారంలోకి వచ్చాక ఉచిత సిలిండర్లు, అన్న క్యాంటీన్లు అమలు చేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. తల్లికి వందనం(విద్యార్థికి ₹15K), అన్నదాత సుఖీభవ(రైతుకు ₹20K) పథకాలను మే, జూన్ నెలల్లో అమలు చేస్తామని ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం ప్రారంభిస్తామని CM CBN సైతం వెల్లడించారు. అన్నదాత సుఖీభవను 3 విడతలుగా అందిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.
News February 7, 2025
గాజా స్వాధీనంపై ట్రంప్ది గొప్ప ఆలోచన: నెతన్యాహు

గాజాను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన <<15364652>>వ్యాఖ్యలను<<>> ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమర్థించారు. ఆయన చేసిన ప్రతిపాదనలో తప్పు లేదని, గొప్ప ఆలోచన అని చెప్పారు. నిజంగా అది అమల్లోకి వస్తే గాజా ప్రజలకు భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. కాగా గాజా నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని ట్రంప్ చేసిన ప్రతిపాదనను అరబ్ దేశాలు ఖండించిన విషయం తెలిసిందే.