News November 4, 2024
భారత జట్టులో సీనియర్లకు ఇదే చివరి సిరీస్?

భారత టెస్ట్ టీమ్లో సీనియర్లైన రోహిత్, కోహ్లీ, అశ్విన్, జడేజా భవితవ్యం ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత తేలనుంది. ఇండియా WTC ఫైనల్కు క్వాలిఫై అవ్వకపోతే వీరికి ఇదే చివరి సిరీస్ అవ్వొచ్చని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. టెస్టుల్లో తన భవితవ్యంపై రోహిత్ తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. తాను ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదని, ప్రస్తుతం తన దృష్టి AUS సిరీస్పైనే ఉందని తెలిపారు.
Similar News
News February 17, 2026
TODAY HEADLINES

* AIపై చర్చకు ప్రపంచాన్ని ఏకం చేస్తున్నాం: PM
* టెక్నాలజీతో పౌర సేవకు బిల్గేట్సే ప్రేరణ: CBN
* చంద్రబాబువి విజనరీ ఆలోచనలు: బిల్ గేట్స్
* మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత
* బడ్జెట్ సెషన్ రెండో దశలో అమరావతి బిల్లు?
* TG: కాంగ్రెస్ ఖాతాలోకి 82 ఛైర్మన్, 5 మేయర్ పోస్టులు
*TG: సన్నాలకు బోనస్.. రూ.514.36 కోట్లు విడుదల
* JEE ఫలితాలు.. ముగ్గురు తెలుగువారికి 100 పర్సంటైల్
News February 17, 2026
ముగ్గురు IASలను పెళ్లి చేసుకున్న IAS ఆఫీసర్!

IAS ఆఫీసర్ అవీ ప్రసాద్ 3 పెళ్లిళ్లు చేసుకోవడం, ముగ్గురు భార్యలూ IASలే కావడం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ క్యాడర్(2014 బ్యాచ్)కి చెందిన ప్రసాద్ తొలుత IAS రిజు బఫ్నాను పెళ్లి చేసుకున్నారు. తర్వాత విడాకులు తీసుకొని 2016 బ్యాచ్ ఆఫీసర్ మిషా సింగ్ను వివాహమాడారు. 4ఏళ్ల తర్వాత ఆమె నుంచీ విడిపోయారు. ఈనెల 11న 2017 బ్యాచ్ ఆఫీసర్ అంకిత ధాక్రేను పెళ్లాడారు. వీరంతా ప్రస్తుతం MPలోనే పనిచేస్తున్నారు.
News February 17, 2026
రైళ్ల టాయిలెట్ల శుభ్రతకు ఏఐ టెక్నాలజీ

రైళ్లలో అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్గా టాయిలెట్లు ఉంటాయి. ఈ సమస్య పరిష్కారానికి రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. రిజర్వ్, జనరల్ బోగీల్లోనూ గంటకోసారి శుభ్రం చేసేలా AIని వాడుతోంది. తొలిదశలో 100 రైళ్లలో ప్రారంభించినట్లు చీఫ్ ప్రాజెక్ట్ ఇంజినీర్ లక్ష్మణ్ తెలిపారు. ‘క్లీనింగ్కు ముందు, తర్వాత ఫొటోలను మొబైల్ యాప్లో సిబ్బంది అప్లోడ్ చేయాలి. వాటిలో ఏ మాత్రం తేడా ఉన్నా AI అప్రమత్తం చేస్తుంది’ అని చెప్పారు.


