News November 4, 2024

భారత జట్టులో సీనియర్లకు ఇదే చివరి సిరీస్?

image

భారత టెస్ట్ టీమ్‌లో సీనియర్లైన రోహిత్, కోహ్లీ, అశ్విన్, జడేజా భవితవ్యం ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత తేలనుంది. ఇండియా WTC ఫైనల్‌కు క్వాలిఫై అవ్వకపోతే వీరికి ఇదే చివరి సిరీస్ అవ్వొచ్చని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. టెస్టుల్లో తన భవితవ్యంపై రోహిత్ తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తాను ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదని, ప్రస్తుతం తన దృష్టి AUS సిరీస్‌పైనే ఉందని తెలిపారు.

Similar News

News January 28, 2026

భారీగా పెరిగిన కొబ్బరి ధరలు

image

AP: కొన్ని నెలలుగా ధరలు లేక ఇబ్బందులు పడుతున్న కొబ్బరి రైతులకు ఊరట కలుగుతోంది. TGలో మేడారం జాతర, వరుస శుభకార్యాల ప్రభావంతో ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. వారం కిందటి వరకు వెయ్యి కాయల ధర రూ.15-16వేలు ఉండగా ఇప్పుడు రూ.19-20 వేలకు చేరింది. ఉభయగోదావరి జిల్లాల నుంచి రోజూ 70 లారీల సరకు ఎగుమతి అవుతోంది. ఇక కురిడీ కొబ్బరిలో పెద్ద రకం రూ.32,500, చిన్నకాయ రూ.29వేల వరకు పలుకుతోంది.

News January 28, 2026

త్వరలో విద్యుత్‌ శాఖలో ఖాళీల భర్తీ: మంత్రి గొట్టిపాటి

image

AP: విద్యుత్‌ శాఖలో ఏఈ స్థాయి ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రకటించారు. రైతులు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం విద్యుత్‌ వ్యవస్థను దుర్వినియోగం చేసి ప్రజలపై రూ.30 వేల కోట్ల భారం మోపిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఛార్జీలు పెంచకుండా, ఎన్నికల లోపు తగ్గించే దిశగా అడుగులు వేస్తోందన్నారు.

News January 28, 2026

30-60 రోజుల మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు నివారణ ఎలా?

image

మొక్కజొన్న పంట 31 నుంచి 60 రోజుల లోపు ఉండి పైరులో 6-10% మొక్కలను కత్తెర పురుగు రెండో దశ లార్వా ఆశించినట్లు గమనిస్తే రసాయన మందులతో సస్యరక్షణ చేపట్టాలి. లీటరు నీటికి 0.4 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ 5% SG లేదా స్పైనోశాడ్ 45% SC 0.3ml కలిపి.. చేతి పంపుతో మొక్క సుడులలో పడే విధంగా పిచికారీ చేసి కత్తెర పురుగును నియంత్రించవచ్చు. ఈ రసాయనాల పిచికారీ విషయంలో వ్యవసాయ నిపుణుల సలహా తప్పక తీసుకోండి.