News November 4, 2024
భారత జట్టులో సీనియర్లకు ఇదే చివరి సిరీస్?

భారత టెస్ట్ టీమ్లో సీనియర్లైన రోహిత్, కోహ్లీ, అశ్విన్, జడేజా భవితవ్యం ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత తేలనుంది. ఇండియా WTC ఫైనల్కు క్వాలిఫై అవ్వకపోతే వీరికి ఇదే చివరి సిరీస్ అవ్వొచ్చని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. టెస్టుల్లో తన భవితవ్యంపై రోహిత్ తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. తాను ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదని, ప్రస్తుతం తన దృష్టి AUS సిరీస్పైనే ఉందని తెలిపారు.
Similar News
News January 31, 2026
‘ధురంధర్’లో తెలుగు నటులు.. గ్రోక్ ఎంపిక ఇదే

‘ధురంధర్’ OTTలోకి రావడంతో నెట్టింట దానిపైనే చర్చ జరుగుతోంది. అందులోని క్యారెక్టర్లకు ఏ తెలుగు నటులు సెట్ అవుతారో చెప్పాలని ఓ నెటిజన్ ‘గ్రోక్’ను అడిగాడు. హంజా (రణ్వీర్ సింగ్)కు జూనియర్ ఎన్టీఆర్, రెహమాన్ డెకాయిత్ (అక్షయ్ ఖన్నా)- రానా దగ్గుబాటి, మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్)- ప్రభాస్, SP అస్లాం (సంజయ్ దత్)- వెంకటేశ్, యెలీనా (సారా అర్జున్)- సమంత, అజయ్ సన్యాల్ (మాధవన్)కు రామ్ చరణ్ అని చూపించింది.
News January 31, 2026
హైకోర్టులో అంబటి భార్య హౌస్ మోషన్ పిటిషన్

AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనతో సహా 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు. తమకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆమె తెలిపారు. 24 గంటలపాటు తమకు భద్రత కల్పించాలని కోరారు. సీఎం చంద్రబాబుపై అంబటి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే.
News January 31, 2026
పాక్ ఆర్మీ కల్నల్ హత్య.. పహల్గామ్ దాడిలో ఇతడి హస్తం?

పాకిస్థానీ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ ఇమ్రాన్ దయాల్ హతమయ్యాడు. జనవరి 28న ఖైబర్ పఖ్తుంఖ్వాలోని డేరా ఇస్మాయిల్ ఖాన్లో గుర్తు తెలియని గన్మెన్లు చంపేశారు. అతడి కారుకు బుల్లెట్లతో తూట్లు పొడిచారు. 2025 ఏప్రిల్లో జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన టెర్రర్ అటాక్లో ఇమ్రాన్ హస్తం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. టెర్రరిస్టులకు హ్యాండ్లర్గా ఇతడు వ్యవహరించినట్లు సమాచారం.


