News November 4, 2024
భారత జట్టులో సీనియర్లకు ఇదే చివరి సిరీస్?

భారత టెస్ట్ టీమ్లో సీనియర్లైన రోహిత్, కోహ్లీ, అశ్విన్, జడేజా భవితవ్యం ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత తేలనుంది. ఇండియా WTC ఫైనల్కు క్వాలిఫై అవ్వకపోతే వీరికి ఇదే చివరి సిరీస్ అవ్వొచ్చని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. టెస్టుల్లో తన భవితవ్యంపై రోహిత్ తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. తాను ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదని, ప్రస్తుతం తన దృష్టి AUS సిరీస్పైనే ఉందని తెలిపారు.
Similar News
News February 4, 2026
పీరియడ్స్లో రొమ్ము నొప్పి సహజమేనా?

కొంతమంది మహిళలకు పీరియడ్స్కి ముందు రొమ్ములు సున్నితంగా ఉండటం, నొప్పి, రొమ్ముల సైజు పెరగడం వంటివి జరుగుతాయి. పీరియడ్స్లో రొమ్ముల్లో వచ్చే ఈ మార్పులను ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్ ఛేంజెస్ అంటారు. పీరియడ్స్లో ఈస్ట్రోజన్ స్థాయిలు పెరగడంతో ఇలా జరుగుతుందంటున్నారు. పీరియడ్స్లో ఇది సాధారణమే కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు. కానీ అసాధారణ లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News February 4, 2026
కల్కి పార్ట్-2లో 90 నిమిషాల పాటు కమల్!

రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న కల్కి పార్ట్-2పై భారీ అంచనాలున్నాయి. FEB చివరి వారం నుంచి ఈ భారీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే పార్ట్-1లో తక్కువ నిడివి ఉన్న కమల్ హాసన్ పాత్ర పార్ట్-2లో 90 నిమిషాల పాటు ఉంటుందట. అలాగే 2 వెరైటీ లుక్స్లో కనిపించనున్నారని సినీ వర్గాల టాక్. దీనికి తోడు ఈ మూవీలో సాయి పల్లవి కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.
News February 4, 2026
రైతులకు గుడ్న్యూస్.. విపత్తుల టైమ్లో డాక్యుమెంట్స్ లేకుండా లోన్?

వరదల వంటి విపత్తుల టైంలో రైతుల నుంచి బ్యాంకులు బలవంతంగా లోన్లు వసూలు చేయొద్దని RBI సూచించింది. కొత్త డ్రాఫ్ట్ ప్రకారం.. ‘బాధిత రైతులకు EMIల రీ-షెడ్యూలింగ్, మారటోరియం, డాక్యుమెంట్స్ లేకుండా టాపప్ లోన్ల వంటి సదుపాయాలు కల్పించాలి. ఎక్స్ట్రా ఛార్జీలు ఏడాది వరకు రద్దు చేయాలి. విపత్తుకు ముందు 30 రోజుల కంటే ఎక్కువ డిఫాల్ట్ అయి ఉండొద్దు’ పేర్కొంది. వీటికి ఆమోదం లభిస్తే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.


