News November 4, 2024
భారత జట్టులో సీనియర్లకు ఇదే చివరి సిరీస్?

భారత టెస్ట్ టీమ్లో సీనియర్లైన రోహిత్, కోహ్లీ, అశ్విన్, జడేజా భవితవ్యం ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత తేలనుంది. ఇండియా WTC ఫైనల్కు క్వాలిఫై అవ్వకపోతే వీరికి ఇదే చివరి సిరీస్ అవ్వొచ్చని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. టెస్టుల్లో తన భవితవ్యంపై రోహిత్ తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. తాను ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదని, ప్రస్తుతం తన దృష్టి AUS సిరీస్పైనే ఉందని తెలిపారు.
Similar News
News February 15, 2026
జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే కావాలి: పవన్

AP: జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ప్రారంభించారు. రూ.2 కోట్ల విరాళం అందించి తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు. 150 మందితో పార్టీని ప్రారంభించగా 2024 ఎన్నికల తర్వాత అది 12.98 లక్షలకు చేరుకుందని పవన్ చెప్పారు. జనసేన భావజాలాన్ని అర్థం చేసుకొని, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే పార్టీకి అవసరమని వ్యాఖ్యానించారు.
News February 15, 2026
ఉపవాసాలు – రకాలు.. మీది ఏ రకం?

ఉపవాసాలు 5 రకాలు. అందులో మొదటిది, కఠినమైనది నిర్జల ఉపవాసం. ఇందులో నీరు కూడా తాగరు. రెండో రకం జల ఉపవాసం. ఇందులో నీటిని మాత్రమే తాగుతారు. ఇక మూడోది ద్రవ ఉపవాసం. ఇందులో కొబ్బరినీళ్లు వంటి పానీయాలు తీసుకోవచ్చు. నాలుగోది ఫలోపవాసం. ఇందులో పాలతో పాటు పండ్లు కూడా తీసుకోవచ్చు. ఇక చివరిది సాత్విక ఉపవాసం. ఇందులో సగ్గుబియ్యం వంటి తేలికపాటి ఆహారం తీసుకోవచ్చు. ఇందులో మీది ఏ ఉపవాసం? COMMENT
News February 15, 2026
చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్లో ఉద్యోగాలు

చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్లో 12 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, సీఏ, ICWA అర్హతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నెలకు రూ.60వేలు, మేనేజర్ పోస్టుకు రూ.70వేలు చెల్లిస్తారు. వెబ్సైట్: https://chial.org/career/


