News November 4, 2024
భారత జట్టులో సీనియర్లకు ఇదే చివరి సిరీస్?

భారత టెస్ట్ టీమ్లో సీనియర్లైన రోహిత్, కోహ్లీ, అశ్విన్, జడేజా భవితవ్యం ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత తేలనుంది. ఇండియా WTC ఫైనల్కు క్వాలిఫై అవ్వకపోతే వీరికి ఇదే చివరి సిరీస్ అవ్వొచ్చని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. టెస్టుల్లో తన భవితవ్యంపై రోహిత్ తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. తాను ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదని, ప్రస్తుతం తన దృష్టి AUS సిరీస్పైనే ఉందని తెలిపారు.
Similar News
News February 9, 2026
డెడ్లైన్లోపు నక్సలిజాన్ని రూపుమాపుతాం: అమిత్ షా

ఆర్థిక నెట్వర్క్లను దెబ్బతీయడం, లొంగుబాటు పాలసీలు నక్సలిజంపై పోరాటంలో సత్ఫలితాలిచ్చాయని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. భద్రతా వ్యూహాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కీలకంగా మారాయన్నారు. మార్చి 31లోపు దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపుతామని స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్ రాయపూర్లో నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలపై పలు రాష్ట్రాల, కేంద్ర సంస్థల ఉన్నతాధికారులతో సమీక్షించినట్టు SMలో పోస్ట్ పెట్టారు.
News February 9, 2026
జపాన్ ప్రధాని తకైచిని అభినందించిన మోదీ

జపాన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఎన్నికల్లో విజయం సాధించిన ఆ దేశ ప్రధాని సనే తకైచిని PM నరేంద్ర మోదీ అభినందించారు. ఆమె సమర్థవంతమైన లీడర్షిప్లో ఇరుదేశాల స్నేహబంధం మరింత బలోపేతమవుతుందని భావిస్తున్నట్టు SMలో పోస్ట్ పెట్టారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం, సమృద్ధిని పెంపొందించడంలో ఇండియా, జపాన్ల స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ కీలకపాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
News February 9, 2026
ఐర్లాండ్పై శ్రీలంక విజయం

T20WCలో ఐర్లాండ్పై శ్రీలంక 20 రన్స్ తేడాతో విజయం సాధించింది. బౌలింగ్లో ఫర్వాలేదనిపించిన ఐర్లాండ్.. బ్యాటింగ్లో మాత్రం తేలిపోయింది. టెక్టర్(40), అడైర్(34), లార్కన్(21) మాత్రమే రాణించారు. ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. కొంతసేపు ఐర్లాండ్ డామినేషన్ కనిపించినా ఆఖరికి ఆలౌట్ అయ్యింది. లంక బౌలర్లలో తీక్షణ, హసరంగ చెరో 3, పతిరాణా 2, వెల్లలాగే, చమీర చెరో వికెట్ తీశారు.


