News November 4, 2024
భారత జట్టులో సీనియర్లకు ఇదే చివరి సిరీస్?

భారత టెస్ట్ టీమ్లో సీనియర్లైన రోహిత్, కోహ్లీ, అశ్విన్, జడేజా భవితవ్యం ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత తేలనుంది. ఇండియా WTC ఫైనల్కు క్వాలిఫై అవ్వకపోతే వీరికి ఇదే చివరి సిరీస్ అవ్వొచ్చని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. టెస్టుల్లో తన భవితవ్యంపై రోహిత్ తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. తాను ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదని, ప్రస్తుతం తన దృష్టి AUS సిరీస్పైనే ఉందని తెలిపారు.
Similar News
News February 2, 2026
నల్లపాడు పీఎస్లో నన్ను వేధించారు: అంబటి

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అరెస్టయిన అంబటి రాంబాబును పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారణ సందర్భంగా తనను నల్లపాడు పీఎస్లో టార్చర్ చేశారని అంబటి న్యాయమూర్తికి తెలిపారు. అధికారుల ఒత్తిడితోనే ఇలా చేయాల్సి వచ్చిందని సీఐ చెప్పారన్నారు. ఏ తప్పూ చేయకపోయినా అన్యాయంగా అరెస్టు చేశారని వాపోయారు. తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు తీసుకోలేదని ఆరోపించారు.
News February 2, 2026
ప్లే ఆఫ్స్లోకి ఢిల్లీ మహిళల జట్టు

WPL-2026 లీగ్ దశ ఆఖరి మ్యాచ్లో యూపీ వారియర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ 122/8 పరుగులకే పరిమితం కాగా, ఢిల్లీ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించి ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఢిల్లీ ఎల్లుండి గుజరాత్తో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడనుంది. ఆ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్లో ఆర్సీబీ జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది.
News February 2, 2026
రికార్డులు చూసుకోండి పాక్..

భారత్తో మ్యాచ్ను <<19024958>>బహిష్కరిస్తున్నట్లు<<>> ప్రకటించిన పాక్ జట్టుపై ఇండియన్స్ సెటైర్లు వేస్తున్నారు. WCలలో INDపై పాక్ రికార్డు చెత్తగా ఉందని గుర్తు చేస్తున్నారు. ODI WCలలో ఆడిన 8 మ్యాచ్ల్లోనూ అన్నీ ఇండియానే గెలిచింది. T20ల్లో ఆడిన 8 పోరుల్లో 6 సార్లు ఇండియాదే విజయం. పాక్ ఒక మ్యాచే గెలవగా మరొకటి డ్రా అయ్యింది. మైదానంలో గెలవడం చేతకాకే పరువు కాపాడుకోవడానికి ఈ డ్రామాలు చేస్తోందంటూ ట్రోల్స్ చేస్తున్నారు.


