News November 4, 2024
భారత జట్టులో సీనియర్లకు ఇదే చివరి సిరీస్?

భారత టెస్ట్ టీమ్లో సీనియర్లైన రోహిత్, కోహ్లీ, అశ్విన్, జడేజా భవితవ్యం ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత తేలనుంది. ఇండియా WTC ఫైనల్కు క్వాలిఫై అవ్వకపోతే వీరికి ఇదే చివరి సిరీస్ అవ్వొచ్చని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. టెస్టుల్లో తన భవితవ్యంపై రోహిత్ తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. తాను ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదని, ప్రస్తుతం తన దృష్టి AUS సిరీస్పైనే ఉందని తెలిపారు.
Similar News
News February 2, 2026
HYD: వంటరితనమే ఆ కుటుంబాన్ని కబళించిందా..?

చర్లపల్లి వద్ద రైలుకింద పడి <<19011053>>తల్లి, పిల్లలు సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. భర్త సురేందర్ ఉద్యోగ రీత్యా దుబాయ్లో ఉండగా మృతురాలు విజయ IT కంపెనీలో టీమ్లీడర్. పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు. ఒంటరితనం పీడిస్తోందని బందువులతో చెప్పి, సూసైడ్ నోట్ రాసి తన కారులో పెట్టి, వాట్సప్ స్టేటస్గా కూడా సూసైడ్ లెటర్ పెట్టినట్లు సమాచారం. సూసైడ్కు కారణం ఒంటరితనమా, మరేదైనా కారణమా అన్నది తెలియాల్సి ఉంది.
News February 2, 2026
పిండి దీపం వెలిగిస్తున్నారా?

పిండి దీపం వెలిగిస్తే పనుల్లో ఆటంకాలు తొలగి, సకల కార్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ఈ దీపారాధనతో గ్రహ దోషాలు, ఆర్థికారోగ్య సమస్యలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. శనివారం రోజు ఈ దీపం వెలిగించడం వల్ల శ్రీనివాసుని అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. నారాయణుడి మంత్రోచ్చారణలతో 7 వారాల పాటు ఇలా చేయాలని సూచిస్తున్నారు. పిండి దీపం ఎలా తయారుచేయాలి, ఎలా వెలిగించాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.
News February 2, 2026
పిగ్మెంటేషన్ రకాలు

పిగ్మెంటేషన్లో 2 రకాలున్నాయి. మొదటిది హైపర్-పిగ్మెంటేషన్. ఇందులో మెలనిన్ అధికంగా ఉత్పత్తి అవ్వడం వలన చర్మంపై ముదురు రంగు మచ్చలు, మెలస్మా, నల్ల మచ్చలు ఏర్పడతాయి. 2వది హైపో-పిగ్మెంటేషన్. ఇందులో మెలనిన్ ఉత్పత్తి తక్కువగా ఉండటం వలన చర్మంపై లేత రంగు మచ్చలు లేదా బొల్లి – విటిలిగో ఏర్పడతాయి. వయస్సు, హార్మోన్ల మార్పులు, సూర్యరశ్మి, కొన్ని రకాల మందులు, జన్యుపరమైన అంశాలు ఈ సమస్యకు కారణం కావచ్చు.


