News November 4, 2024

భారత జట్టులో సీనియర్లకు ఇదే చివరి సిరీస్?

image

భారత టెస్ట్ టీమ్‌లో సీనియర్లైన రోహిత్, కోహ్లీ, అశ్విన్, జడేజా భవితవ్యం ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత తేలనుంది. ఇండియా WTC ఫైనల్‌కు క్వాలిఫై అవ్వకపోతే వీరికి ఇదే చివరి సిరీస్ అవ్వొచ్చని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. టెస్టుల్లో తన భవితవ్యంపై రోహిత్ తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తాను ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదని, ప్రస్తుతం తన దృష్టి AUS సిరీస్‌పైనే ఉందని తెలిపారు.

Similar News

News January 30, 2026

రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన స్టిర్లింగ్

image

ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. అత్యధిక T20I మ్యాచ్‌లు(160) ఆడిన ప్లేయర్‌గా నిలిచారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ(159 M) రికార్డును బ్రేక్ చేశారు. 3, 4, 5 స్థానాల్లో జార్జ్ డాక్‌రెల్(ఐర్లాండ్-153 M), మహ్మద్ నబీ(అఫ్ఘాన్-148 M), జోస్ బట్లర్(ఇంగ్లండ్-144 M) ఉన్నారు. కాగా స్టిర్లింగ్ T20Iలలో 3,874 రన్స్, 20 వికెట్లు తీశారు.

News January 30, 2026

కందలో ఎలాంటి అంతర పంటలతో మేలు

image

కంద దుంపలు మొలకెత్తడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి, తక్కువ కాలపరిమితి కలిగిన నువ్వు, మినుము, చిరుధాన్యాలు మొదలైన పంటలను అంతర పంటలుగా ఆయా ప్రాంతాలకు, కాలానికి తగిన విధంగా ఎంపిక చేసి సాగు చేసుకోవచ్చు. అలాగే పసుపులో మిశ్రమ పంటగా కందను వేసుకోవచ్చు. అరటి, కొబ్బరిలో అంతర పంటగా వేసి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. పసుపులో కూడా కందను అంతర పంటగా వేసి మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.

News January 30, 2026

50% కన్వీనర్ కోటా మెడికల్ సీట్లు తప్పించింది జగనే: సత్యకుమార్

image

AP: GOVT మెడికల్ కాలేజీల్లోని 50% సీట్లు కన్వీనర్ కోటా నుంచి తప్పించి ఫీజు తీసుకొని భర్తీ చేసేలా మాజీ CM జగనే చేశారని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. ‘ఇపుడు PPPలో ఆస్పత్రులను అభివృద్ధి చేస్తుంటే ఆయన ఆరోపణలు చేస్తున్నారు. దీనిలో భాగస్వామ్య సంస్థే నిధులు భరించి అభివృద్ధి చేస్తుంది. డిఫెన్స్‌లోనూ ఇదే విధానం ఉంది’ అని పేర్కొన్నారు. APR1 నుంచి 1.43 కోట్ల మందికి ₹25 L వరకు ఉచిత వైద్యం అందుతుందన్నారు.