News November 4, 2024
భారత జట్టులో సీనియర్లకు ఇదే చివరి సిరీస్?

భారత టెస్ట్ టీమ్లో సీనియర్లైన రోహిత్, కోహ్లీ, అశ్విన్, జడేజా భవితవ్యం ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత తేలనుంది. ఇండియా WTC ఫైనల్కు క్వాలిఫై అవ్వకపోతే వీరికి ఇదే చివరి సిరీస్ అవ్వొచ్చని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. టెస్టుల్లో తన భవితవ్యంపై రోహిత్ తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. తాను ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదని, ప్రస్తుతం తన దృష్టి AUS సిరీస్పైనే ఉందని తెలిపారు.
Similar News
News February 6, 2026
ఓటు వేయాలంటే ‘గుర్తింపు’ ఉండాల్సిందే: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కోసం ఓటర్లు సిద్ధం కావాలని కలెక్టర్ చంద్రశేఖర్ కోరారు. ఈ నెల 11న జరిగే పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘం సూచించిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఆధార్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు లేదా రేషన్ కార్డు వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాలను చూపించి ఓటు వేయవచ్చని ఆయన తెలిపారు.
News February 6, 2026
ఆ ఒక్క స్టార్టప్ విలువ.. మన 10 బడా IT కంపెనీల కంటే ఎక్కువ!

ఆంథ్రోపిక్ పేరు ఇప్పుడు IT ఇండస్ట్రీలో మారుమోగుతోంది. ఈ స్టార్టప్ తెచ్చిన టూల్తో ఇండియన్ IT కంపెనీల షేర్లు బెంబేలెత్తిపోయాయి. ఈ నేపథ్యంలో SM వేదికగా ఒక ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. రీసెంట్ ఫండింగ్ తర్వాత ఆంథ్రోపిక్ మార్కెట్ విలువ $350 బిలియన్లకు చేరింది. అదే టైమ్లో ఇండియాలోని టాప్-10 IT కంపెనీల విలువ దాదాపు $330 బిలియన్లకు పడిపోయింది. అంటే ఆ ఒక్క కంపెనీ వాల్యూ మన 10 కంపెనీల కంటే ఎక్కువ!
News February 6, 2026
బెంగాల్ ఎన్నికలు.. ఒంటరిగా బరిలోకి కాంగ్రెస్..!

వె.బెంగాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. లెఫ్ట్ పార్టీలతో 2 దశాబ్దాలుగా ఉన్న పొత్తు తెంచుకుని 2006 తర్వాత తొలిసారి ఒంటరిగా బరిలోకి దిగనుంది. 294 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో రాష్ట్ర నేతల సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. పొత్తుల కారణంగానే రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావడం లేదని హైకమాండ్కు తెలిపారు.


