News January 21, 2025

లబ్ధిదారుల లిస్టులో మీ పేరు లేదా? ఇలా చేయండి!

image

TG: ఈనెల 26 నుంచి ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వీటి అమలు విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి జరుగుతుందని చెప్పారు. నేటి నుంచి గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని, అర్హత ఉండి లిస్టులో పేరు లేని వారు గ్రామ సభల్లో అధికారులకు అప్లికేషన్లు ఇవ్వాలని సూచించారు.

Similar News

News December 14, 2025

24 గంటల్లోనే అకౌంట్లలోకి డబ్బులు: టీడీపీ ఎమ్మెల్యే

image

AP: 2025-26 ఖరీఫ్ సీజన్‌లో ఒక్క రోజే రికార్డు స్థాయిలో 1.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు TDP ఎమ్మెల్యే సాంబశివరావు తెలిపారు. 3.24 లక్షల రైతుల ఖాతాల్లో రూ.4,609 కోట్లు జమ చేయడం ఓ రికార్డని చెప్పారు. 24 గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది రూ.12,200 కోట్ల విలువైన 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

News December 14, 2025

మత్తు ఇంజెక్షన్‌తో నడుం నొప్పి వస్తుందా?

image

సీ సెక్షన్ డెలివరీ చేసేటప్పుడు మహిళలకు మత్తు ఇంజెక్షన్‌(అనస్థీషియా) ఇస్తారు. అయితే ఈ సూదిని వెన్నెముకకు ఇస్తారని, దీనివల్ల నడుంనొప్పి వస్తుందని కొందరు అనుకుంటారు. కానీ ఇది అపోహే అంటున్నారు వైద్యులు. ఈ ఇంజెక్షన్ నేరుగా వెన్నెముకలోని ఎముకకు ఇవ్వరని చెబుతున్నారు. డెలివరీ తర్వాత వీపు వెనుక ఎలాంటి సపోర్ట్ లేకుండా పాలివ్వడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల నడుం నొప్పి వస్తుందంటున్నారు.

News December 14, 2025

‘నల్లమల సాగర్‌’పై సుప్రీంలో ఏపీ కేవియట్!

image

AP: పోలవరం-నల్లమల సాగర్‌ సాగునీటి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందుగానే కేవియట్ పిటిషన్ వేయాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను కృష్ణా డెల్టా చీఫ్ ఇంజినీర్‌కు అప్పగించింది. కాగా ఈ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి రెండు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. L1గా వచ్చిన సంస్థకు బాధ్యతలు అప్పగిస్తారు.