News October 7, 2024

40వేల టార్గెట్స్, 4700 టన్నెల్స్‌పై బాంబులేసిన ఇజ్రాయెల్

image

యుద్ధం మొదలయ్యాక 40వేల హమాస్ టార్గెట్స్, 4700 టన్నెల్స్, 1000 రాకెట్ లాంచర్ సైట్లను బాంబులతో నాశనం చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. 2023 OCT 7 నుంచి 726 మంది తమ సైనికులు మరణించారని తెలిపింది. అదేరోజు 380, మిలిటరీ ఆపరేషన్స్ మొదలయ్యాక మిగిలినవాళ్లు చనిపోయారని పేర్కొంది. 4576 మంది గాయపడ్డారని చెప్పింది. 3 లక్షల రిజర్వు సైనికుల్ని నమోదు చేసుకున్నామని, అందులో 82% మెన్, 18% విమెన్ ఉన్నారని తెలిపింది.

Similar News

News April 2, 2026

ఆప్ డిప్యూటీ నేతగా రాఘవ్ చద్దా తొలగింపు!

image

రాజ్యసభలో తమ పార్టీ డిప్యూటీ లీడర్‌గా ఉన్న రాఘవ్ చద్దాను ఆప్ తొలగించింది. ఆయన స్థానంలో అశోక్ మిట్టల్‌(పంజాబ్)ను నియమించినట్లు రాజ్యసభ సెక్రటేరియట్‌కు లేఖ రాసింది. పార్లమెంటులో మాట్లాడేందుకు ఆయనకు సమయం ఇవ్వొద్దని కోరింది. పార్టీకి, చద్దాకు మధ్య విభేదాలు వచ్చాయనే వార్తల నేపథ్యంలో ఆప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇటీవల వరుసగా ప్రజా సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతూ చద్దా వార్తల్లో నిలిచారు.

News April 2, 2026

ఈ సాయంత్రం దీపాలు వెలిగిద్దాం: లోకేశ్

image

AP: అమరావతికి పట్టిన గ్రహణం వీడిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత వచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించి ఈ చారిత్రక విజయాన్ని వేడుకలా చేసుకుందామని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ‘మన రాజధాని.. మన గౌరవం’ అని ట్వీట్ చేశారు.

News April 2, 2026

RECORD: ‘యశోద-కృష్ణ’ పెయింటింగ్‌కు ₹167కోట్లు

image

ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన ‘యశోద-కృష్ణ’ ఆయిల్ పెయింటింగ్‌ వేలంలో సరికొత్త రికార్డు సృష్టించింది. ముంబైలో జరిగిన వేలంలో ఈ చిత్రం ఏకంగా రూ.167.2 కోట్లకు అమ్ముడైంది. భారతీయ కళా చరిత్రలో అత్యధిక ధర పలికిన చిత్రంగా ఇది నిలిచింది. గతంలో ఈ రికార్డు MF హుస్సేన్ గీసిన ‘అన్‌టైటిల్డ్’ పెయింటింగ్‌పై ఉండేది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఫౌండర్ సైరస్ పూనావాలా ఈ అరుదైన కళాఖండాన్ని సొంతం చేసుకున్నారు.