News March 27, 2024

పెద్దిరెడ్డికి ఇసుకే టిఫిన్.. మైన్స్ మధ్యాహ్న భోజనం: CBN

image

AP: బాబాయిని గొడ్డలితో చంపిన వ్యక్తులతో జగన్ తిరుగుతున్నారని మదనపల్లె ప్రజాగళం సభలో చంద్రబాబు ఆరోపించారు. ‘మంత్రి పెద్దిరెడ్డికి ఇసుకే ఉదయం అల్పాహారం. మైన్స్ మధ్యాహ్న భోజనం. అన్నమయ్య జిల్లాలో పాపాల పెద్దిరెడ్డి పాలన సాగుతోంది. కాంట్రాక్టులన్నీ ఆయనే తీసుకుని, ఇసుకను అక్రమంగా బెంగళూరుకు తరలిస్తున్నారు. రౌడీయిజం కావాలో? ప్రజాస్వామ్యం కావాలో? ప్రజలే తేల్చుకోవాలి’ అని చంద్రబాబు అన్నారు.

Similar News

News April 8, 2026

నల్గొండ: రోడ్ రోలర్‌తో బైక్‌ల సైలెన్సర్లు ధ్వంసం

image

జిల్లా ప్రజలు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. బుధవారం నల్గొండ క్లాక్ టవర్ వద్ద అడిషనల్ ఎస్పీ రమేశ్ ఆధ్వర్యంలో, బైక్‌లకు అమర్చిన 72 మాడిఫైడ్ సైలెన్సర్లను రోడ్ రోలర్‌తో ధ్వంసం చేయించారు. ధ్వని కాలుష్యం కలిగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

News April 8, 2026

డైలీ ఒక్క స్పూన్.. మీ హెల్త్ సేఫ్

image

*హలీం సీడ్స్: 100g రూ.20-30 లోపే. ఇందులోని ఐరన్‌తో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. నీటిలో నానబెట్టి తినొచ్చు.
*గుమ్మడి గింజలు: అరకిలో రూ.120-150కి. ఫైబర్, మెగ్నీషియం, జింక్, హెల్తీ ఫ్యాట్ కండరాలను బలోపేతం చేస్తాయి. నేరుగా తినొచ్చు.
*ఫ్లాక్స్ సీడ్స్: 100g రూ.30-50లోపే. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి సహకరిస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్, హార్మోన్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. పొడిచేసి తీసుకోవాలి.

News April 8, 2026

ఖబడ్దార్.. కేటీఆర్, హరీశ్‌కు పొంగులేటి వార్నింగ్

image

TG: KTR, హరీశ్ రావుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘మీ అవినీతి చిట్టా అంతా ప్రభుత్వం దగ్గర ఉంది. త్వరలో అన్నీ బయటకు వస్తాయి. మీ తాటాకు చప్పుళ్లకు భయపడం.. ఖబడ్దార్’ అని సెక్రటేరియట్‌లో ప్రెస్‌మీట్‌లో హెచ్చరించారు. ఇక నాదర్‌గుల్ భూముల్లో వాటా దక్కకపోవడం వల్లే హరీశ్ తనపై <<19499785>>ఆరోపణలు<<>> చేస్తున్నారని మండిపడ్డారు. వట్టినాగులపల్లి భూములతో తన కొడుకుకి ఎలాంటి సంబంధం లేదన్నారు.