News March 4, 2025

IT బిజినెస్ మోడల్ పనైపోయింది: HCL టెక్ CEO

image

భారత ఐటీ ఇండస్ట్రీ 30 ఏళ్లుగా అనుసరిస్తున్న సంప్రదాయ బిజినెస్ మోడల్ పనైపోయిందని HCL టెక్ CEO విజయ్ కుమార్ ప్రకటించారు. AI విజృంభణతో ఈ మోడల్ పాతబడిందని పేర్కొన్నారు. భవిష్యత్తుకు తగినట్టు ఉండాలన్నా, మెరుగైన వృద్ధి కావాలన్నా కంపెనీల మైండ్‌సెడ్ మారాలని స్పష్టం చేశారు. AIని వాడుకొని ప్రొడక్షన్ పెంచాలని, సగం ఉద్యోగులతోనే రెట్టింపు రెవెన్యూ సృష్టించాలని తమ టీమ్స్‌ను సవాల్ చేస్తున్నామని తెలిపారు.

Similar News

News March 4, 2025

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు Shocking News

image

AIతో సగం ఉద్యోగులతోనే డబుల్ రెవెన్యూ సాధించాలని టీమ్స్‌ను సవాల్ చేస్తున్నామని HCL టెక్ CEO<<15647926>> విజయ్<<>> కుమార్ చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. Infy CEO సలిల్ పారేఖ్ ఆయనతో ఏకీభవించడం మరింత భయపెడుతోంది. కంపెనీలన్నీ AI దారి అనుసరిస్తే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో సగం మందికి జాబ్స్ పోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే వెస్ట్ నుంచి ప్రాజెక్టులు తగ్గి రెవెన్యూ మందగించిన వేళ మరెన్ని దుర్వార్తలు వినాల్సి వస్తోందో!

News March 4, 2025

ఆదోనికి పోసాని కృష్ణమురళి

image

AP: గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళిని ఆదోని PSకు తరలిస్తున్నారు. అక్కడ ఆయనపై కేసు నమోదైన నేపథ్యంలో పీటీ వారెంట్ దాఖలు చేసి తీసుకెళ్తున్నారు. మరోవైపు, నరసరావుపేట కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్ వేయగా దానిపై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. రాజంపేట జైలులో ఉన్న ఆయన్ను నిన్న పోలీసులు పీటీ వారంట్‌పై నరసరావుపేట తీసుకురాగా, జడ్జి 10 రోజులు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.

News March 4, 2025

మైక్రోచిప్‌, ఓలా, స్టార్‌బక్స్‌లో వేలాది ఉద్యోగాల కోత

image

మైక్రోచిప్‌, ఓలా, స్టార్‌బక్స్‌ సంస్థలు భారీగా ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటించాయి. మైక్రోచిప్ 2వేలు, ఓలా ఎలక్ట్రిక్ 1000, స్టార్‌బక్స్ 1100, హెచ్‌పీ 2వేల ఉద్యోగాల్ని తొలగించనున్నాయి. ఖర్చు తగ్గింపులో భాగంగా కొలువుల్ని తగ్గిస్తున్నట్లు సంస్థలు వివరిస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లోపు లే ఆఫ్స్ పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో ఉద్యోగుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

error: Content is protected !!