News March 7, 2025

BRS ఎంపీలు లేకనే తెలంగాణకు అన్యాయం: కేసీఆర్

image

TG: లోక్‌సభలో BRS ప్రాతినిధ్యం లేకపోవటం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ 14 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని మూటగట్టుకుందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏప్రిల్ 27న WGLలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ (25 ఏళ్ల) వేడుకలకు లక్షలాదిగా ప్రజలు తరలిరావాలని కోరారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి ఫాంహౌస్‌లో పార్టీ నాయకులతో చర్చలు జరిపారు.

Similar News

News November 18, 2025

BIG BREAKING: లొంగుబాటులో మావో చీఫ్

image

మావోయిస్టులకు సంబంధించి Way2Newsకు కీలక సమాచారం అందింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విజయవాడలో అరెస్టైన మావోయిస్టుల్లో 9 మంది దేవ్ జీ సెక్యూరిటీ అని AP ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా వెల్లడించారు. దీంతో తన గార్డులతో పాటు దేవ్ జీ లొంగిపోయి ఉంటారని తెలుస్తోంది. దీనిపై కొద్ది గంటల్లో అధికార వర్గాల నుంచి ప్రకటన రావచ్చు.

News November 18, 2025

BIG BREAKING: లొంగుబాటులో మావో చీఫ్

image

మావోయిస్టులకు సంబంధించి Way2Newsకు కీలక సమాచారం అందింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విజయవాడలో అరెస్టైన మావోయిస్టుల్లో 9 మంది దేవ్ జీ సెక్యూరిటీ అని AP ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా వెల్లడించారు. దీంతో తన గార్డులతో పాటు దేవ్ జీ లొంగిపోయి ఉంటారని తెలుస్తోంది. దీనిపై కొద్ది గంటల్లో అధికార వర్గాల నుంచి ప్రకటన రావచ్చు.

News November 18, 2025

తెలంగాణలో అతిపెద్ద BESS సౌర ప్రాజెక్టు

image

TG: బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS)తో 1500 MW సౌర విద్యుత్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటుకానుంది. కేంద్రం ఆమోదించిన అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. మహేశ్వరం, చౌటుప్పల్ ప్రాంతాల్లో TGGENCO ఈ ప్లాంట్లను అభివృద్ధి చేస్తుంది. ఈమేరకు ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి GO విడుదల చేశారు. దీని ద్వారా అందే విద్యుత్ యూనిట్‌ ధర ₹2.90 మాత్రమే. ఇప్పటికే AP, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాయి.