News September 21, 2024

ఇది క్షమించరాని నేరం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

image

TG: తిరుమల లడ్డూ ఘటన దిగ్భ్రాంతిని కలిగించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రసాదాన్ని అపవిత్రం చేయడం క్షమించరాని నేరమని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటమే కాకుండా బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు.

Similar News

News November 19, 2025

నేటి నుంచి ఉమ్మడి వరంగల్‌లో పత్తి కొనుగోలు ప్రారంభం

image

ఉమ్మడి వరంగల్‌లో నేటి నుంచి పత్తి కొనుగోళ్లు పునఃప్రారంభం కానున్నాయి. సీసీఐ కొనుగోళ్లలో తలెత్తిన సమస్యలను పది రోజుల్లో పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ట్రేడర్స్ అసోసియేషన్ బంద్ విరమించింది. సచివాలయంలో మంత్రి నాగేశ్వరరావు, అధికారులు, సీసీఐ ప్రతినిధులు, కాటన్ ట్రేడర్స్ అసోసియేషన్‌తో సమావేశమై జిన్నింగ్-ప్రెస్సింగ్ సమస్యలపై చర్చించారు. ప్రభుత్వ హామీ మేరకు కొనుగోళ్లు ప్రారంభమవుతాయి.

News November 19, 2025

PDPL: డ్రగ్స్ గురించి సమాచారం తెలిస్తే చెప్పండి: కలెక్టర్

image

PDPL జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి మాదకద్రవ్యాల నిరోధంపై ఆయన నిన్న ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ యువత జీవితాలను నాశనం చేస్తాయని, దీనిపై ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News November 19, 2025

పద్మనాభంలో స్వామి ఉత్సవం ఎలా ప్రారంభమైంది?

image

పద్మనాభంలోని గిరి ప్రాంతంలో 1938లో విజయనగరం పాలకుడు పూసపాటి అలక్ నారాయణ గజపతి ఆనతి మేరకు ద్రాక్షారామం నుంచి వచ్చిన చేకూరి, బుల్లి సత్యనారాయణరాజు ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. త్రిపుర సుందరీదేవి విగ్రహాన్ని తీసుకువచ్చి యజ్ఞాలు నిర్వహించేవారు. ఆఖరిరోజు అనంతుని కొండ మెట్ల పంక్తికి దీపోత్సవాన్ని నిర్వహించేవారు. కొంతకాలం ఉత్సవం నిలిచినా..1987లో ఆలయ అర్చకుడు కృష్ణమాచార్యుల సూచనల మేరకు పునఃప్రారంభించారు.