News May 11, 2024
మంగళగిరిలో ఐటీ సోదాలు.. రూ.8కోట్ల పట్టివేత

AP: గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. ఓ వస్త్ర, వడ్డీ వ్యాపారి ఇంట్లో ఐటీ అధికారులు రూ.8 కోట్ల వరకు నగదు, రూ.25 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల వేళ ఇంత మొత్తం నగదు లభించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 16, 2025
ఐపీఎల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ ఇవాళ సాయంత్రం రానుంది. సా.5.30 గంటలకు జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18లో ప్రత్యక్ష ప్రసారం కానున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.
News February 16, 2025
రూ.100 కోట్ల క్లబ్లోకి ‘తండేల్’

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్’ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతోంది. విడుదలైన 9 రోజుల్లోనే రూ.100 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ వారం రిలీజైన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ మూవీ కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 7న విడుదలైంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు.
News February 16, 2025
Dy.CMతో రాజేంద్రప్రసాద్ భేటీ

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో నటుడు రాజేంద్ర ప్రసాద్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి పలు అంశాలపై మాట్లాడుకున్నారు. తాజా రాజకీయ అంశాలు, టాలీవుడ్ ఇండస్ట్రీపై చర్చించుకున్నట్లు సమాచారం. అంతకుముందు పవన్ను రాజేంద్రప్రసాద్ సన్మానించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.