News December 24, 2024

బట్టతలకు చికిత్స దొరికేసినట్లేనా.?

image

బట్టతలపై జుట్టు మొలిపించే పరిష్కారం తమకు లభించిందని UK, పాక్‌ పరిశోధకులు ఓ ప్రకటనలో తెలిపారు. ‘చిట్టెలుకలపై గాయాలను మాన్పించే ప్రయోగం చేస్తున్న సమయంలో వాటికి డియాక్సీరిబోస్ అనే షుగర్‌ను ఇచ్చాం. దాన్ని ఇచ్చిన చోట ఎలుకలకు కొత్తగా జుట్టు మొలిచింది. మనిషి శరీరంలో ఈ షుగర్ అంతర్భాగం. దీన్ని వాడటం ద్వారా బట్టతలపై వెంట్రుకల్ని మళ్లీ తెప్పించేందుకు అవకాశం ఉంది’ అని వారు వివరించారు.

Similar News

News January 26, 2025

యుద్ధ వీరులకు ప్రధాని మోదీ నివాళి

image

ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళి అర్పించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన వీర సైనికుల త్యాగాలను మోదీ స్మరించుకున్నారు. ఆయన వెంట రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు ఉన్నారు. అనంతరం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

News January 26, 2025

స్వర్ణాంధ్ర విజన్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు: గవర్నర్

image

AP: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని గవర్నర్ నజీర్ అన్నారు. విజయవాడలో గణతంత్ర వేడుకల్లో మాట్లాడుతూ ‘గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి సమస్యలు సృష్టించింది. స్వర్ణాంధ్ర విజన్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా చేసింది. ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలనేదే ప్రభుత్వ నినాదం’ అని వ్యాఖ్యానించారు.

News January 26, 2025

అర్ధరాత్రి అకౌంట్లలో రూ.6,000 జమ

image

TG: ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించనున్నారు. రైతు భరోసా కింద పంట సాగు చేస్తున్న అన్నదాతలకు ఎకరాకు రూ.6వేలు అకౌంట్లలో జమ కానున్నాయి. ఆత్మీయ భరోసా ద్వారా భూమి లేని వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు కూడా రూ.6వేలను అకౌంట్లలో వేయనున్నారు. అయితే ఇవాళ ఆదివారం సెలవు కావడంతో అర్ధరాత్రి 12 గంటల తర్వాత లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ కానున్నట్లు అధికారులు తెలిపారు.