News March 10, 2025

అప్పుడు హాస్యాస్పదం.. ఇప్పుడేమో!

image

ఈజీగా మనీ సంపాదించవచ్చు అంటూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో IPS అధికారి రమేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘లలిత జువెల్లరీ ఓనర్ కిరణ్ డబ్బులు ఎవరికీ ఊరికే రావు అని చెప్పే వ్యాఖ్యలు చాలా మందికి హాస్యాస్పదం అనిపించవచ్చు. ఇప్పుడు జరుగుతున్న ఆర్థిక నేరాలు చూస్తుంటే ఇదే వేద వాక్కు అనిపిస్తుంది. అత్యాశకు పోయి డబ్బు సంపాదించుకోవాలని అనుకునేవారు ఓ సారి పునరాలోచించండి’ అని పేర్కొన్నారు.

Similar News

News March 10, 2025

ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలని రామ్మోహన్ లేఖ

image

AP: శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్, రెండు ఫిషింగ్ జెట్టీలు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి శర్బానంద సోనోవాల్‌కు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు లేఖ రాశారు. తన నియోజకవర్గం శ్రీకాకుళంలో 197కి.మీ సముద్ర తీర ప్రాంతం ఉందని, 230కి పైగా గ్రామాల ప్రజలు మత్స్య సంపదపైనే ఆధారపడి ఉన్నారని వివరించారు. సంతబొమ్మాళి(మ) భావనపాడు గ్రామం వద్ద ఫిషింగ్ పోర్ట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

News March 10, 2025

అస్సాంకు సొంత ఉపగ్రహం

image

త్వరలో ‘అస్సాంశాట్’ అనే సొంత ఉపగ్రహాన్ని లాంఛ్ చేయనున్నట్లు అస్సాం ఆర్థిక మంత్రి అజంతా నియోగ్ ప్రకటించారు. సరిహద్దులపై నిఘాకు, కీలక సామాజిక-ఆర్థిక ప్రాజెక్టులపై సమాచారం కోసం ఈ శాటిలైట్‌ను వాడనున్నట్లు పేర్కొన్నారు. మౌలిక వసతుల అభివృద్ధి, విపత్తు నిర్వహణ, వ్యవసాయానికి కూడా అది ఉపకరిస్తుందని వివరించారు. ప్రయోగం పూర్తైతే సొంత శాటిలైట్ ఉన్న తొలి రాష్ట్రంగా అస్సాం నిలవనుంది.

News March 10, 2025

రామగుండం ఎయిర్‌పోర్ట్ సాధ్యం కాదు: కేంద్రం

image

TG: పెద్దపల్లి(D) రామగుండంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని స్థానిక MP గడ్డం వంశీ చేసిన ప్రతిపాదనలపై కేంద్రం స్పందించింది. ‘ఇక్కడ ఎయిర్‌పోర్టు ఏర్పాటు సాధ్యం కాదు. చుట్టూ కొండలు, ఎయిర్‌స్పేస్‌పై IAF ఆంక్షలు ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు. ఒక వేళ ప్రభుత్వం నుంచి వస్తే పరిశీలిస్తాం’ అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు MPకి రిప్లై ఇచ్చారు.

error: Content is protected !!