News March 10, 2025

అప్పుడు హాస్యాస్పదం.. ఇప్పుడేమో!

image

ఈజీగా మనీ సంపాదించవచ్చు అంటూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో IPS అధికారి రమేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘లలిత జువెల్లరీ ఓనర్ కిరణ్ డబ్బులు ఎవరికీ ఊరికే రావు అని చెప్పే వ్యాఖ్యలు చాలా మందికి హాస్యాస్పదం అనిపించవచ్చు. ఇప్పుడు జరుగుతున్న ఆర్థిక నేరాలు చూస్తుంటే ఇదే వేద వాక్కు అనిపిస్తుంది. అత్యాశకు పోయి డబ్బు సంపాదించుకోవాలని అనుకునేవారు ఓ సారి పునరాలోచించండి’ అని పేర్కొన్నారు.

Similar News

News April 17, 2026

BJP రాజకీయంతోనే బిల్లు వీగింది: KTR

image

TG: డీలిమిటేషన్ అంశాన్ని ముడిపెట్టడంతోనే మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోయిందని కేటీఆర్ విమర్శించారు. BRS సహా అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్లకు సానుకూలంగా ఉన్నా.. BJP రాజకీయంతోనే బిల్లు వీగిందని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లతోనే రిజర్వేషన్లను అమలు చేసి ఉంటే ఎటువంటి సమస్య వచ్చేది కాదన్నారు. ఇప్పటికైనా వెంటనే డీలిమిటేషన్ అంశంతో సంబంధం లేకుండా కొత్త బిల్లు తేవాలని డిమాండ్ చేశారు.

News April 17, 2026

కమిన్స్ ఎప్పటి నుంచి ఆడతారంటే?

image

IPL: SRH కెప్టెన్ పాట్ కమిన్స్ నేడు ఆ జట్టు క్యాంపులో చేరనున్నారని క్రీడావర్గాలు తెలిపాయి. అయితే రేపు చెన్నైతో జరిగే మ్యాచులో అతడు ఆడే అవకాశం లేదని పేర్కొన్నాయి. ఏప్రిల్ 25 నుంచి జరిగే మ్యాచులకు అందుబాటులో ఉండవచ్చని వెల్లడించాయి. కాగా కమిన్స్ రాకతో ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ దళం బలపడనుంది.

News April 17, 2026

మీరేం సాధించారో ఆలోచించుకోండి.. జగన్ ఆగ్రహం

image

AP: మహిళలకు రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించిన పార్టీలను విమర్శిస్తూ YCP చీఫ్ జగన్ ట్వీట్ చేశారు. ‘మీరేం సాధించారో ఓసారి ఆలోచించుకోండి. మహిళా రిజర్వేషన్ల బిల్లు వాయిదా పడింది. అటు దక్షిణాదికి గానీ ఇటు మహిళలకు గానీ న్యాయం జరగలేదు. ఒకవేళ 2026 జనగణన ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే దక్షిణాది పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది’ అని పేర్కొన్నారు.