News April 4, 2024

ఇది సిగ్గుపడాల్సిన విషయం: KTR

image

TG: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ పరిధిలోని నందికొండ హిల్ కాలనీ మంచినీటి ట్యాంకులో కోతులు పడి <<12985788>>చనిపోయిన<<>> ఘటనపై కేటీఆర్ స్పందించారు. ‘మున్సిపల్ శాఖ సిగ్గుపడాల్సిన విషయం ఇది. మంచినీటి ట్యాంకుల శుభ్రత, సాధారణ నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజారోగ్యం కంటే రాజకీయాలే ముఖ్యం. ఈ 100 రోజుల్లో ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారింది’ అని దుయ్యబట్టారు.

Similar News

News April 20, 2025

ఇవాళ బీసీ గురుకుల ప్రవేశ పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి

image

TG: 2025-26కు గాను BC గురుకుల స్కూళ్లలో ఖాళీగా ఉన్న 6, 7, 8, 9వ తరగతి సీట్ల భర్తీకి ఇవాళ పరీక్ష జరగనుంది. ఇందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 6,832 బ్యాక్‌లాగ్ సీట్లకు గాను 26,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 109 పరీక్ష కేంద్రాల్లో ఉ.10 గంటల నుంచి మ.12గంటల వరకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్లు తీసుకెళ్లాలి. ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి ఉండదు.

News April 20, 2025

వరల్డ్ కప్ కోసం భారత్ వెళ్లం: పాక్

image

భారత్‌లో జరగనున్న ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్‌లో తమ టీమ్ పాల్గొనబోదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ముందే జరిగిన ఒప్పందం ప్రకారం తటస్థ వేదికల్లోనే తాము ఆడతామని PCB ఛైర్మన్ నఖ్వీ తెలిపారు. ‘ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో భారత్ ఎలాగైతే మా దేశానికి రాకుండా న్యూట్రల్ వేదికల్లో ఆడిందో, మేము కూడా అలాగే ఆడతాం. WC ఆతిథ్య దేశమైన భారతే ఆ వేదికలను ఎంపిక చేయాలి’ అని నఖ్వీ అన్నారు.

News April 20, 2025

ఈ నెల 23 నుంచి భారత్-అమెరికా వాణిజ్య చర్చలు

image

ఈ నెల 23 నుంచి 3 రోజుల పాటు వాషింగ్టన్‌లో భారత్, అమెరికా వాణిజ్య చర్చలు జరపనున్నాయి. టారిఫ్స్ నుంచి కస్టమ్స్ వరకు పలు అంశాలపై ఈ చర్చల్లో ఇరు దేశాలు ఓ ఒప్పందానికి వచ్చే అవకాశం ఉంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో ఉన్న సమస్యలు పరిష్కారం కావొచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. భారత బృందానికి వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి రాజేశ్ అగ్రవాల్ నేతృత్వం వహించనున్నారు.

error: Content is protected !!