News October 18, 2024
CM రేవంత్ విజన్కు దోహదపడటం ఓ గౌరవం: అదానీ

యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ విషయంలో TG CM రేవంత్ రెడ్డి దార్శనికతకు, నాయకత్వానికి దోహదపడటాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నామని గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు. ‘మన యువత భవిష్యత్తును తీర్చిదిద్దడమే కాక మరింత సుసంపన్నమైన భారత్ను సృష్టించేందుకు అవసరమైన సామర్థ్యాల్ని మేం వెలికి తీస్తున్నాం. తరతరాలను ఉద్ధరించనున్నాం’ అని పేర్కొన్నారు. వర్సిటీ ఏర్పాటుకోసం ఆయన సీఎం రేవంత్కి రూ.100 కోట్ల చెక్కు అందించారు.
Similar News
News July 11, 2025
భారత్పై 11వ సెంచరీ బాదిన రూట్

భారత్తో జరుగుతున్న మూడో టెస్టులో ENG స్టార్ బ్యాటర్ రూట్ సెంచరీతో చెలరేగారు. రెండో రోజు తొలి బంతికే ఫోర్ కొట్టి శతకం పూర్తి చేశారు. భారత్పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా స్మిత్ సరసన చేరారు. 60 ఇన్నింగ్స్లలో 11 సెంచరీలు చేశారు. మొత్తంగా 37 సెంచరీలు చేసి ద్రవిడ్, స్మిత్(36)ను అధిగమించి టాప్ 5లో నిలిచారు. మరోవైపు బుమ్రా బౌలింగ్లో స్టోక్స్(44) ఔటయ్యారు. ప్రస్తుతం ENG స్కోర్ 265/5.
News July 11, 2025
యాపిల్ ఉద్యోగికి ₹1,714 కోట్లు చెల్లించిన మెటా!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అగ్రగామిగా నిలిచేందుకు మెటా CEO మార్క్ ఉద్యోగులకు కోట్లు కుమ్మరిస్తున్నారు. తాజాగా యాపిల్ కంపెనీలోని అగ్రశ్రేణి AI నిపుణుడైన రూమింగ్ పాంగ్ను మెటా నియమించుకుంది. తమ ‘సూపర్ ఇంటెలిజెన్స్’ గ్రూపులో పాంగ్ను చేర్చినట్లు తెలిపింది. దీనికోసం ఆయనకు మెటా ఏడాదికి $200M( ₹1,714కోట్లు) చెల్లించనుండడం టెక్ యుగంలో చర్చనీయాంశమైంది. ఈ ప్యాకేజీ ఇచ్చేందుకు యాపిల్ ఇష్టపడలేదు.
News July 11, 2025
2 దేశాలకు ఆడిన అరుదైన క్రికెటర్ రిటైర్

రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన పీటర్ మూర్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై పలికారు. 35 ఏళ్ల మూర్ 2014 నుంచి 2019 వరకు జింబాబ్వే తరఫున ఆడారు. ఆ దేశం తరఫున 49 వన్డేలు, 21 టీ20లు, 8 టెస్టులు ఆడి 1,700కుపైగా పరుగులు చేశారు. ఆ తర్వాత ఐర్లాండ్కు వలస వెళ్లి 7 టెస్టులు ఆడారు. ఐర్లాండ్ తరఫున వన్డే వరల్డ్ కప్ ఆడాలన్న తన కోరిక నెరవేరకుండానే వీడ్కోలు పలికారు. తన చివరి మ్యాచ్ జింబాబ్వేపైనే ఆడడం విశేషం.