News August 11, 2025
ఇందులో నా తప్పులేదు: నిధి అగర్వాల్

AP: తాను ప్రభుత్వ వాహనంలో తిరగడంపై నెలకొన్న వివాదంపై హీరోయిన్ నిధి అగర్వాల్ స్పందించారు. ‘భీమవరంలో ఓ స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా ఇది జరిగింది. స్థానిక నిర్వాహకులు నాకోసం కారును ఏర్పాటు చేశారు. అది ప్రభుత్వ వాహనమని నాకు తెలియదు. ఇందులో నా ప్రమేయం లేదు. ప్రభుత్వమే నాకు ఈ వాహన సదుపాయం కల్పించిందని కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ తప్పు. అభిమానులు నమ్మవద్దు’ అని ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News April 19, 2026
నెల్లూరు జిల్లాలో 212మంది పోలీసుల బదిలీ

నెల్లూరు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 5ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న 212 మంది సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేశారు. SP అజిత వేజెండ్ల సిబ్బందితో మాట్లాడి పారదర్శకంగా బదిలీలు చేపట్టారు. అన్ని విభాగాల నుంచి ఖాళీల వివరాలను సేకరించారు. సిబ్బంది అభ్యర్థనలు, అవసరాలను పరిగణలోకి తీసుకుని ట్రాన్స్ఫర్ చేశారు. బదిలీ అయిన వారిలో కానిస్టేబుళ్ల నుంచి ఏఎస్ఐ స్థాయి వరకు ఉన్న సిబ్బంది ఉన్నారు.
News April 19, 2026
కేజీ చికెన్ ధర ఎంతంటే?

హైదరాబాద్లో కేజీ స్కిన్ లెస్ చికెన్ ఏరియాను బట్టి రూ.270 నుంచి రూ.280 వరకు అమ్ముతున్నారు. వరంగల్లో రూ.270, కామారెడ్డి రూ.270, ఖమ్మంలో రూ.280కి విక్రయిస్తున్నారు. ఏపీలోని విజయవాడలో రూ.230, పల్నాడులో రూ.250-రూ.280, కర్నూలులో రూ.260, నంద్యాలలో రూ.280గా ఉంది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడాలున్నాయి. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News April 19, 2026
MMTS రైళ్లలో ఫ్రీ జర్నీ.. జూన్ 2 నుంచి అమలు?

TG: HYDలో ట్రాఫిక్, పొల్యూషన్కు చెక్ పెట్టేందుకు MMTS రైళ్లలో ప్రయాణికులందరికీ ఉచిత ప్రయాణం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని JUNE 2 నుంచి ఏడాదిపాటు అమలు చేయాలని భావిస్తోంది. ఫలితాన్ని బట్టి ఆ తర్వాత కొనసాగించే ఛాన్సుంది. ఈ మేరకు ద.మ.రైల్వేకు లేఖ రాసింది. MMTS రైళ్ల ద్వారా రైల్వేకి ఏడాదికి సుమారు ₹10Cr ఆదాయం వస్తుండగా, దానిని తామే చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పినట్లు సమాచారం.


