News October 5, 2024
జెర్రి పడిందన్నది అవాస్తవం.. నమ్మొద్దు: TTD

తిరుమల అన్నప్రసాదంలో జెర్రి కనిపించిందంటూ వస్తున్న ఆరోపణల్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఖండించింది. అవి అవాస్తవాలని తేల్చిచెప్పింది. ‘వేలాదిమందికి వడ్డించేందుకు ప్రసాదాన్ని తయారుచేస్తారు. అంత వేడిలో ఓ జెర్రి ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉందనడం ఆశ్చర్యకరం. ఇది కావాలని చేసిన చర్యగా భావించాల్సి వస్తోంది. దయచేసి భక్తులు ఇలాంటి వార్తల్ని నమ్మొద్దని టీడీపీ విజ్ఞప్తి చేస్తోంది’ అని ఓ ప్రకటనలో కోరింది.
Similar News
News February 18, 2026
25,487పోస్టులు.. పరీక్ష వాయిదా

CAPFS, SSF, అస్సాం రైఫిల్స్లో ఖాళీగా ఉన్న 25, 487 కానిస్టేబుల్ (<
News February 18, 2026
భారీగా పెరిగిన అరటి ధరలు.. గెల ఎంతంటే?

AP: అరటి ధరలకు రెక్కలొచ్చాయి. JAN వరకు కర్పూర చక్కెరకేళి, తెల్ల చక్కెరకేళి, ఎర్ర చక్కెరకేళి గెల ₹200-300 ఉండేది. ఇప్పుడు ₹700-1000కి పెరిగింది. ఏప్రిల్ వరకు ఇవే ధరలు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. ఉమ్మడి తూ.గో, ప.గో జిల్లాల్లో అరటిని ఎక్కువగా సాగు చేస్తారు. గత 3ఏళ్లుగా తక్కువ ధరలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాలు రావడంతో సాగు విస్తీర్ణం తగ్గింది. డిమాండ్కు తగ్గట్లు అరటి మార్కెట్లోకి రావట్లేదు.
News February 18, 2026
నేరేడు పూత, పిందె దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నేరేడు చెట్లకు ఫిబ్రవరి ఆఖరు నుంచి లేదా మార్చి తొలి వారంలో నీటి వసతిని ఏర్పాటు చేసుకుంటే పూత రాలకుండా నివారించుకోవచ్చు. ఒకవేళ వచ్చిన పూత రాలుతున్నట్లు గమనిస్తే 15 లీటర్ల నీటిలో ప్లానోఫిక్స్ అనే మందు 3 గ్రాములను కలుపుకొని ఒకసారి పిచికారీ చేయాలి. దీని వల్ల పూత రాలడం తగ్గి, పిందె కట్టడానికి, పిందె శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కాయ నాణ్యత పెంచడానికి కూడా ఈ మందు కొంత సాయం చేస్తుంది.


