News February 18, 2025

ప్రజాస్వామ్యంపై జగన్ లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది: లోకేశ్

image

AP: అధికారం ఉన్నప్పుడు చట్టాలను తుంగలో తొక్కి… ఇప్పుడు ప్రజాస్వామ్యం, పద్ధతులు అంటూ జగన్ లెక్చర్ ఇవ్వడం వింతగా ఉందని మంత్రి లోకేశ్ అన్నారు. 100 మందికి పైగా వైసీపీ రౌడీలు టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం కోట్లాది మంది కళ్లారా చూశారని చెప్పారు. పచ్చి అబద్ధాలను కాన్ఫిడెంట్‌గా చెప్పడంలో జగన్ PhD చేసినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు జగన్ బ్రాండ్ అని ఫైరయ్యారు.

Similar News

News December 12, 2025

‘టెన్త్’ షెడ్యూల్‌పై వివాదం.. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వివరణ

image

TG: టెన్త్ పరీక్షల షెడ్యూల్ (MAR 14-APR 16) <<18526038>>వివాదంపై<<>> స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ వివరణ ఇచ్చారు. ‘పేరెంట్స్, స్టూడెంట్స్ రిక్వెస్ట్‌తో పరీక్షల మధ్య తగినంత గ్యాప్ ఇచ్చాం. CBSE, ఇతర బోర్డుల విధానాలను అధ్యయనం చేసి సైంటిఫిక్‌గా షెడ్యూల్ రూపొందించాం. మ్యాథ్స్, సైన్స్, సోషల్‌కు ఎక్కువ రోజులు సెలవులిచ్చాం. స్టూడెంట్స్ ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా రివిజన్ చేసుకోవచ్చు’ అని పేర్కొన్నారు.

News December 12, 2025

IVFతో అప్పుల పాలవుతున్న జంటలు

image

ప్రస్తుతకాలంలో సంతానలేమి సమస్య పెరగడంతో చాలామంది IVF చికిత్స చేయించుకుంటున్నారు. అయితే దీనివల్ల 90శాతం జంటలు అప్పులపాలవుతున్నట్లు ICMR నివేదికలో వెల్లడైంది. ఈ చికిత్సను ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) పరిధిలోకి తీసుకురావాలని ICMR సూచించింది. ఈ ఖర్చులను కూడా రీయింబర్స్ చేయాలని ఆ నివేదికలో సిఫార్సు చేసింది. దీనిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

News December 12, 2025

బస్సు ప్రమాదం.. ఘటనా స్థలానికి హోంమంత్రి

image

AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో జరిగిన <<18539765>>బస్సు ప్రమాద<<>> స్థలానికి హోం మంత్రి అనిత హుటాహుటిన బయలుదేరారు. మరికాసేపట్లో ఘటనా స్థలానికి చేరుకోనున్నారు. ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన మంత్రి.. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మంత్రి సంధ్యారాణి సైతం ఘటనా స్థలానికి బయల్దేరారు. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు.