News February 18, 2025
ప్రజాస్వామ్యంపై జగన్ లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది: లోకేశ్

AP: అధికారం ఉన్నప్పుడు చట్టాలను తుంగలో తొక్కి… ఇప్పుడు ప్రజాస్వామ్యం, పద్ధతులు అంటూ జగన్ లెక్చర్ ఇవ్వడం వింతగా ఉందని మంత్రి లోకేశ్ అన్నారు. 100 మందికి పైగా వైసీపీ రౌడీలు టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం కోట్లాది మంది కళ్లారా చూశారని చెప్పారు. పచ్చి అబద్ధాలను కాన్ఫిడెంట్గా చెప్పడంలో జగన్ PhD చేసినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు జగన్ బ్రాండ్ అని ఫైరయ్యారు.
Similar News
News April 11, 2026
ఏపీలో 6 జోన్లు.. లిస్ట్ ఇదే

AP: ఉద్యోగాల కల్పనకు సంబంధించి రాష్ట్రంలోని 4 జోన్లను క్యాబినెట్ 6 జోన్లుగా మార్చింది. రెండు మల్టీ జోన్లను మూడుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
Z1: SKLM, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి
Z2: అల్లూరి, తూ.గో, కాకినాడ, కోనసీమ
Z3: ప.గో, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా
Z4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు
Z5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప
Z6: నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి
News April 11, 2026
పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. ఫలితాలు విడుదల

పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్(GDS) ఉద్యోగాల భర్తీకి JANలో ఇచ్చిన 28,636 పోస్టుల భారీ నోటిఫికేషన్ <
News April 11, 2026
మనిషి ప్రాణం, ఆకలి గురించి ఎంత గొప్పగా చెప్పారో!

పని తొడవులు వేరు బంగారమొక్కటి
పరగ ఘటలు వేరు ప్రాణమొక్కటి
అరయ తిండ్లు వేరు ఆకలి యొక్కటి
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: ఆభరణాలు ఎన్ని రకాలున్నా వాటిని తయారు చేసే బంగారం ఒక్కటే. మనుషుల రూపాలు, శరీరాలు వేర్వేరుగా ఉన్నా వాటిలో ఉండే ప్రాణం ఒక్కటే. అలాగే ఆహారాలు ఎన్నో ఉన్నా వాటిని కోరే ఆకలి మాత్రం ఒక్కటే.
<<-se>>#PADHYAM<<>>


