News January 21, 2025
జాక్ పాట్.. రూ.10 కోట్ల లాటరీ గెలిచిన లారీ డ్రైవర్

పంజాబ్కు చెందిన లారీ డ్రైవర్ జాక్ పాట్ కొట్టాడు. పంజాబ్ స్టేట్ డియర్ లోహ్రీ మకర్ సంక్రాంతి బంపర్-2025లో రూప్ నగర్ జిల్లాకు చెందిన హర్పిందర్ సింగ్ రూ.10 కోట్లు గెలుచుకున్నాడు. ఇప్పటివరకు అందించిన అతిపెద్ద లాటరీ ప్రైజ్ మనీ ఇదేకావడం విశేషం. సింగ్ కువైట్లో ట్రక్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సెలవులపై తిరిగొచ్చి రూ.500 పెట్టి లాటరీ టికెట్ కొని కోటీశ్వరుడయ్యాడు. గత 15 ఏళ్లుగా అతను లాటరీలు కొంటున్నాడు.
Similar News
News January 8, 2026
అమరావతిపై జగన్ వ్యాఖ్యలు.. మంత్రుల దండయాత్ర

AP: జగన్ అమరావతిపై చేసిన <<18799615>>కామెంట్స్<<>> రాష్ట్రంలో ముందుగానే భోగి మంటలు రాజేశాయి. మంత్రులు ఒక్కొక్కరుగా కౌంటర్ అటాక్కు దిగారు. ఇటీవల YCP చేసిన ఏ ఆరోపణల మీదా ఇలా వెంటనే ఎదురుదాడి చేయలేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాష్ట్రానికి కీలకమైన అంశం, రూ.వందల కోట్ల మేర పనులు జరుగుతున్న ప్రాంతంపై ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్లొద్దనే ఇలా రియాక్ట్ అయినట్లు టాక్.
News January 8, 2026
3 మ్యాచులకు తిలక్ వర్మ దూరం

న్యూజిలాండ్తో జరిగే 5 మ్యాచుల టీ20 సిరీస్లో తొలి 3 మ్యాచులకు తిలక్ వర్మ దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. మిగతా 2 మ్యాచుల్లో ఆయన ఆడే విషయంపై ఫిట్నెస్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. నిన్న ఆయనకు సర్జరీ జరిగినట్లు పేర్కొంది. తిలక్ ఆస్పత్రి నుంచి ఈరోజు డిశ్చార్జ్ అయ్యారని, రేపు HYDకు వస్తారని వెల్లడించింది. IND, NZ టీ20 సిరీస్ ఈ నెల 21 నుంచి జరగనుంది.
News January 8, 2026
కొడుక్కు ఇచ్చిన మాట.. 75% సంపాదన సమాజానికి!

తన కొడుకు అగ్నివేశ్(49) <<18794363>>ఆకస్మిక మరణం<<>> నేపథ్యంలో వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కుమారుడికి ఇచ్చిన మాట ప్రకారం తమ సంపాదనలో 75% సమాజానికి ఇస్తానని తెలిపారు. ‘ఆకలితో ఎవరూ నిద్రపోకూడదని, విద్యకు దూరం కాకూడదని, స్త్రీలు తమ కాళ్లపై నిలబడాలని, యువతకు సరైన పని ఉండాలని కలలు కన్నాం. మేం ఆర్జించిన దాంట్లో 75% సొసైటీకి వెనక్కివ్వాలని అగ్నికి ప్రామిస్ చేశా’ అని చెప్పారు.


