News April 3, 2024
జగన్, అవినాశ్లను ఓడించాలి: సునీత

AP: ఈ ఎన్నికల్లో ఎంపీ అవినాశ్ రెడ్డి, CM జగన్లను ఓడించాలని వివేకా కుమార్తె సునీత పిలుపునిచ్చారు. ‘మా నాన్న హత్య కేసులో శిక్ష పడితే ఎన్నికల్లో పోటీకి అనర్హులవుతారు. కేసు విచారణకు రానీయకుండా జాప్యం చేస్తుంటే దోషులకు ఎప్పుడు శిక్ష పడుతుంది? ఇది వ్యవస్థలతో ఆడుకోవడమే. నేరగాళ్లు మళ్లీ మళ్లీ గెలుస్తుంటే.. వ్యవస్థలను స్వప్రయోజనాలకు వాడుకుంటారు. గత ఎన్నికల్లో జగన్ను గుడ్డిగా నమ్మా’ అని ఆమె వెల్లడించారు.
Similar News
News April 23, 2025
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా

ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించారు. టీ20ల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్గా ఆయన అవతరించారు. హైదరాబాద్తో మ్యాచులో బుమ్రా ఈ ఫీట్ నెలకొల్పారు. 237 ఇన్నింగ్సుల్లో ఆయన ఈ ఘనత సాధించారు. ఓవరాల్గా అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్గా జస్ప్రీత్ నిలిచారు. అగ్ర స్థానంలో ఆండ్రూ టై ఉన్నారు. అతడు 208 మ్యాచుల్లోనే 300 వికెట్ల మార్కును అందుకున్నారు.
News April 23, 2025
ఉగ్రదాడి మృతులపై అధికారిక ప్రకటన

పహల్గామ్లో టూరిస్టులపై నిన్న ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాల్ దేశస్థుడు చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. గాయపడిన వారు త్వరగా కోలుకునేలా అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఈ ఉగ్రదాడిని ప్రపంచంలోని చాలా దేశాలు ఖండించాయని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వివరించారు.
News April 23, 2025
ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం: CM చంద్రబాబు

AP: పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన విశాఖ వాసి చంద్రమౌళి మృతదేహానికి CM చంద్రబాబు నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటామన్నారు. చంద్రమౌళితో పాటు కావలికి చెందిన మరో వ్యక్తి మరణించగా, ఇరు కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఉగ్రదాడి జరిగిందని, సరిహద్దుల్లో చొరబాటుదారులను సమర్థంగా అడ్డుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు.