News March 11, 2025

జగన్ రూ.కోటి సాయం అందలేదు: పార్థసారథి

image

AP: విజయవాడ వరద బాధితులకు సాయంపై శాసనమండలిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్ రూ.కోటి ఇచ్చారని బొత్స తెలపగా మంత్రి పార్థసారథి స్పందించారు. ప్రభుత్వానికి జగన్ ఇచ్చిన విరాళం అందలేదన్నారు. అలాగే, సాక్షి పేపర్ కొనుగోలుకు ప్రభుత్వం వాలంటీర్లకు నెలకు రూ.200 ఇచ్చిందని, అక్రమంగా చేసిన చెల్లింపులపై విచారణ చేయిస్తామన్నారు. అక్రమాలు చేసిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News December 4, 2025

ఎల్లుండి నుంచి APP పరీక్షల హాల్ టికెట్లు

image

TG: 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పోస్టుల పరీక్షా హాల్ టికెట్లను ఈ నెల 6వ తేదీ ఉ.8గం. నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని TSLPRB ప్రకటించింది. 13వ తేదీ రాత్రి 12గం. వరకు సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈనెల 14న రాత పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఉ.10గం. నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్-1(ఆబ్జెక్టివ్), మధ్యాహ్నం 2.30 నుంచి 5.30గం. వరకు పేపర్-2(డిస్క్రిప్టివ్) ఉంటాయని తెలిపింది.

News December 4, 2025

APPLY NOW: టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలు

image

<>ఎయిమ్స్<<>> గోరఖ్‌పూర్‌లో 7 టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా(MLT, DMLT, రేడియోగ్రఫీ, ఇమేజ్ టెక్నాలజీ), ఇంటర్, డిగ్రీ(BCA, IT, సోషియాలజీ, సోషల్ వర్క్), పీజీ(పబ్లిక్ హెల్త్ & రిలేటెడ్ సబ్జెక్ట్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. డిసెంబర్ 8న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://aiimsgorakhpur.edu.in/

News December 4, 2025

మొక్కజొన్న కోత, నిల్వలో తేమ ముఖ్యం

image

మొక్కజొన్న పంట కోత సమయంలో తేమ కీలకమని, రైతులు సరైన సమయంలో కోత చేపడితే మంచి ధర పొందవచ్చంటున్నారు వ్యవసాయ నిపుణులు. గింజల్లో 25 నుంచి 30 శాతం తేమ ఉన్నప్పుడు కోత చేపట్టి కండెలను 2-3 రోజులు ఎండలో ఆరబెట్టాలి. సుమారు 15 శాతం తేమ ఉన్నప్పుడు నూర్పిడి యంత్రాల సహాయంతో నూర్పిడి చేసి గింజలను ఎండబెట్టాలి. గోదాములలో నిల్వ చేయాలనుకుంటే సుమారు 10 శాతం తేమ ఉన్న గింజలను నిల్వచేయాలని నిపుణులు సూచిస్తున్నారు.