News July 18, 2024

సచివాలయం అంటే ఏంటో కూడా జగన్‌కు తెలియదు: మంత్రి ఆనం

image

AP: మాజీ సీఎం జగన్‌కు సచివాలయం అంటే ఏంటో కూడా తెలియదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. తన అనుయాయులకు వేల ఎకరాలు కట్టబెట్టి రూ.వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ‘వైసీపీ ప్రభుత్వం ఏపీకి రాజధాని లేకుండా చేసింది. విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా రూ.వేల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం నిలిచిపోయిన రాజధాని అమరావతి, పోలవరం పనులు మళ్లీ మొదలుపెడుతున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News October 26, 2025

దూసుకొస్తున్న తుఫాను.. 20 జిల్లాల్లో సెలవులు

image

AP: ‘మొంథా’ తుఫాను రాష్ట్ర తీర ప్రాంతం వైపు దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 20జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అనంతపురం, సత్యసాయి, నంద్యాల, KNL, తిరుపతి, SKL జిల్లాల్లో హాలిడేస్ ఇవ్వలేదు. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంది. తీవ్ర ప్రభావం చూపే కాకినాడ జిల్లాలో 27 నుంచి 31 వరకు హాలిడే ప్రకటించారు. మిగతా జిల్లాల్లో 1 నుంచి 3 రోజుల వరకు సెలవులిచ్చారు.

News October 26, 2025

మొంథా తుఫాను పయనమిలా..

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటల్లో 8Kmph వేగంతో కదిలిందని APSDMA తెలిపింది. ప్రస్తుతానికి చెన్నైకి 720km, విశాఖపట్నానికి 790km, కాకినాడకి 780km దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఇది 12 గంటల్లో నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుందని తెలిపింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి, ఆరోజు రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే ఛాన్స్ ఉందని పేర్కొంది.

News October 26, 2025

నాతో పార్టీ పెట్టించే అవసరం కేసీఆర్‌కు లేదు: కవిత

image

TG: తనతో పార్టీ పెట్టించే అవసరం కేసీఆర్‌కు లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా NZBలో మీడియాతో మాట్లాడారు. ‘అందరికీ మంచి జరగాలనే జనం బాట చేపట్టాం. రాజకీయ పార్టీ అవసరమైతే పెడతాం. నన్ను బయటికి పంపి పార్టీ పెట్టించే అవసరం KCRకు లేదు. KCRను, BRSను ఇష్యూ బేస్డ్‌గానే విమర్శిస్తాను. కాంగ్రెస్ ఓ మునిగిపోయే నావ. ఆ పార్టీ నాకు మద్దతు ఇవ్వటమేంటి?’ అని వ్యాఖ్యానించారు.