News April 4, 2024

ఏపీలో మళ్లీ జగన్ ప్రభుత్వమే: BRS MLA

image

AP అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వైసీపీనే గెలుస్తుందని HYD జూబ్లీహిల్స్ MLA మాగంటి గోపీనాథ్(బీఆర్ఎస్) జోస్యం చెప్పారు. ‘చంద్రబాబు పని అయిపోయింది. బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆయన చాలా తప్పు చేశారు. జాతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలేవీ తర్వాతి కాలంలో మనుగడ సాధించిన దాఖలాలు లేవు. పొత్తు తర్వాత జతగూడిన పార్టీలను మింగేస్తాయి’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News December 25, 2025

ప్రస్తుతం నా క్రష్ మృణాల్ ఠాకూర్: నాగవంశీ

image

హీరోయిన్లలో రష్మిక అంటే ఇష్టమని, మృణాల్ ఠాకూర్ తన క్రష్ అని నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరోవైపు Ntr నటించిన ‘వార్-2’కు భారీ నష్టాలంటూ జరిగిన ప్రచారంపై ఆయన స్పందించారు. ‘తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను రూ.68 కోట్లకు కొన్నాను. దానికి రూ.35-40 కోట్ల షేర్ వచ్చింది. ఈ క్రమంలో ఆ మూవీ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ పిలిచి రూ.18 కోట్లు వెనక్కి ఇచ్చింది. పెద్దగా నష్టాలు రాలేదు’ అని పేర్కొన్నారు.

News December 25, 2025

బంగ్లాదేశ్‌లో హిందువుల ఇళ్లకు నిప్పు..

image

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గడిచిన 5 రోజుల్లో 7 హిందూ కుటుంబాలపై <<18670618>>నిరసనకారులు<<>> దాడి చేసినట్టు తెలుస్తోంది. 2 ఇళ్లకు నిరసనకారులు నిప్పుపెట్టిన ఘటనలో 8 మంది త్రుటిలో తప్పించుకున్నారు. ఈ దాడి చేసినట్టు అనుమానిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్లాన్ ప్రకారమే దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు. మూడు రోజుల క్రితం కూడా హిందువుల ఇంటిపై నిరసనకారులు దాడి చేశారు.

News December 25, 2025

శివాజీ వ్యాఖ్యల వివాదం.. అనసూయ వార్నింగ్

image

TG: శివాజీ వివాదాస్పద <<18666465>>వ్యాఖ్యల<<>> నేపథ్యంలో నటి అనసూయ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. రాజ్యాంగంలో ఆర్టికల్-19 కింద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని అడ్వకేట్ లీలా శ్రీనివాస్ మాట్లాడిన <>వీడియోను<<>> ఆమె షేర్ చేశారు. బెదిరింపు, అసభ్యకర మాటలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకు రావని, చట్ట ప్రకారం కేసులు పెట్టొచ్చని అడ్వకేట్ అందులో హెచ్చరించారు. ఏదైనా మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించాలని సూచించారు.