News April 24, 2024

APని జగన్ ముంచేశారు: చంద్రబాబు

image

APలో ఎక్కడ చూసినా విధ్వంసమే కనిపిస్తోందని TDP అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పాతపట్నంలో ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ‘ప్రజలకు సేవ చేసేందుకు జగన్‌కు అధికారం ఇస్తే.. అమరావతిని నాశనం చేశారు. పోలవరాన్ని ముంచేశారు. YCP పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి భూములు కొల్లగొట్టేందుకు కుట్ర చేస్తున్నారు. జగన్ పాలనలో రాష్ట్రం నష్టపోయింది. ప్రజలూ నష్టపోయారు’ అని ఆరోపించారు.

Similar News

News March 13, 2026

15ఏళ్లలో లేనంతగా క్రాష్.. $533 బిలియన్ల నష్టం!

image

సెన్సెక్స్ ఈరోజు 878 పాయింట్ల నష్టంతో 75,174.. నిఫ్టీ 299 Pts నష్టంతో 23,339 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక ఈ ఏడాది ఆరంభంలో ₹489L Crగా ఉన్న భారత మార్కెట్ క్యాప్ ₹440L Crకు తగ్గింది. 2011లో $625B కోల్పోగా ఈ ఏడాది మూడు నెలల్లోనే ఆ స్థాయి పతనం నమోదైంది. ఈ నష్టం మెక్సికో, మలేషియా, నార్వే, ఖతర్, వియత్నాం వంటి దేశాల Mcap కంటే ఎక్కువ. FII సెల్లింగ్, ట్రేడ్ టెన్షన్స్, యుద్ధాలు ఇందుకు కారణం.

News March 13, 2026

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణం

image

AP: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా చండీగఢ్‌కు చెందిన జస్టిస్ లీసా గిల్ ప్రమాణం చేశారు. హైకోర్టులోని మొదటి హాలులో ఆమె చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఏప్రిల్ 24న CJ పదవీ విరమణ తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపడతారు. దీంతో ఏపీ హైకోర్టు తొలి మహిళా సీజేగా చరిత్రకెక్కనున్నారు.

News March 13, 2026

42 ఏళ్లు కోమాలో ఉన్న అరుణ గురించి తెలుసా?

image

12 ఏళ్లుగా కోమాలో ఉన్న హరీశ్ రాణా(32) కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు ఇటీవల <<19352489>>అనుమతిచ్చింది.<<>> ఈ తీర్పునకు ముంబైకి చెందిన నర్సు అరుణా షాన్‌బాగ్ కేసు స్ఫూర్తి. 1973లో ఆమెను రేప్ చేసి దాడి చేయడంతో 42 ఏళ్లపాటు కోమాలో ఉండి 2015లో చనిపోయారు. 2009లో ఆమె కారుణ్య మరణం కోసం ఓ జర్నలిస్టు పిల్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే 2011, 2018, 2023లో వెలువడిన తీర్పులు కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేశాయి.