News April 24, 2024

APని జగన్ ముంచేశారు: చంద్రబాబు

image

APలో ఎక్కడ చూసినా విధ్వంసమే కనిపిస్తోందని TDP అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పాతపట్నంలో ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ‘ప్రజలకు సేవ చేసేందుకు జగన్‌కు అధికారం ఇస్తే.. అమరావతిని నాశనం చేశారు. పోలవరాన్ని ముంచేశారు. YCP పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి భూములు కొల్లగొట్టేందుకు కుట్ర చేస్తున్నారు. జగన్ పాలనలో రాష్ట్రం నష్టపోయింది. ప్రజలూ నష్టపోయారు’ అని ఆరోపించారు.

Similar News

News November 10, 2025

అత్యాచార బాధితురాలిపై లాయర్ ఘాతుకం

image

గ్యాంగ్ రేప్ బాధితురాలిపై అత్యాచారం చేశాడో లాయర్. UPలోని ఆగ్రాలో ఈ ఘటన జరిగింది. 2022లో జరిగిన గ్యాంగ్‌రేప్ కేసును కోర్టు బయట సెటిల్ చేస్తానని నిందితుల్లో ఒకరి లాయర్ జితేంద్ర సింగ్ యువతి(24)ని నమ్మించాడు. హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అతడి నుంచి విడిపించుకుని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అతడు ఇంటిపై నుంచి దూకడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి.

News November 10, 2025

NSUTలో 176 పోస్టులు.. అప్లై చేశారా?

image

ఢిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (<>NSUT<<>>)లో 176 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల అభ్యర్థులు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE, బీటెక్, BS, ME, ఎంటెక్, MS, PhDతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 35- 50 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nsut.ac.in/

News November 10, 2025

పిల్లలతో వ్యాయామం చేయిస్తున్నారా?

image

వ్యాయామం చేయడం పిల్లలకూ అవసరమేనంటున్నారు నిపుణులు. ఎదిగే వయసులో కండరాలు, ఎముకలు బలపడటానికి వ్యాయామం తోడ్పడుతుంది. ముఖ్యంగా రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచే వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, టెన్నిస్ వారానికి కనీసం మూడు రోజుల పాటైనా చేసేలా చూసుకోవాలి. 3-5 ఏళ్ల పిల్లలనైతే రోజంతా చురుకుగా కదిలేలా, రకరకాల ఆటలు ఆడుకునేలా ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు.