News April 24, 2024

APని జగన్ ముంచేశారు: చంద్రబాబు

image

APలో ఎక్కడ చూసినా విధ్వంసమే కనిపిస్తోందని TDP అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పాతపట్నంలో ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ‘ప్రజలకు సేవ చేసేందుకు జగన్‌కు అధికారం ఇస్తే.. అమరావతిని నాశనం చేశారు. పోలవరాన్ని ముంచేశారు. YCP పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి భూములు కొల్లగొట్టేందుకు కుట్ర చేస్తున్నారు. జగన్ పాలనలో రాష్ట్రం నష్టపోయింది. ప్రజలూ నష్టపోయారు’ అని ఆరోపించారు.

Similar News

News January 25, 2025

మాజీ సీఎం కేసీఆర్ సోదరి కన్నుమూత

image

TG: మాజీ సీఎం కేసీఆర్ ఐదో సోదరి చీటి సకలమ్మ కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో కొద్దిసేపటి కిందటే చనిపోయారు. కొంతకాలంగా వయోభారం, అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె కన్నుమూయగా, మృతదేహాన్ని ఓల్డ్ అల్వాల్‌లోని నివాసానికి తరలించారు. సకలమ్మ మృతిచెందడంతో సోదరుడు కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

News January 25, 2025

జగన్ CM కావడానికి VSR పనిచేశారు: కాకాణి

image

AP: జగన్ CM కావడానికి <<15247358>>విజయసాయిరెడ్డి<<>> పని చేశారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ‘పార్టీ కోసం పాటుపడ్డారు. కుట్రలు, దుష్ప్రచారం చేసినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. వైసీపీతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది’ అని కాకాణి చెప్పారు. మరోవైపు తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానన్న వార్తలను ఆ పార్టీ నేత అయోధ్య రామిరెడ్డి ఖండించారు. దావోస్ పర్యటన నుంచి వచ్చాక మీడియాతో మాట్లాడతానన్నారు.

News January 25, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: జనవరి 25, శనివారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4.32 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 6.08 గంటలకు ✒ ఇష: రాత్రి 7.23 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.