News March 19, 2024
ఎన్నికల సమయంలో జనంలోనే జగన్: సజ్జల

AP: వైసీపీ నిర్వహించిన ‘సిద్ధం’ సభలకు అనుహ్య స్పందన వచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 28న నంద్యాల, 30న కర్నూలు(ఎమ్మిగనూరు)లో బస్సుయాత్ర, బహిరంగ సభలు ఉంటాయని తెలిపారు. ఉదయం ఇంటరాక్షన్ కార్యక్రమాలు, సాయంత్రం సభలు నిర్వహిస్తామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనంతగా సభలు ఉంటాయన్నారు. వైసీపీ సంక్షేమాన్ని ప్రజలకు చేరవేస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో సీఎం జగన్ జనంలోనే ఉంటారన్నారు.
Similar News
News November 17, 2025
మాట్లాడుకుంటేనే సమస్యలకు పరిష్కారం

భార్యాభర్తల ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి. కొన్నిసార్లు అహం, ఇంకొన్నిసార్లు అపార్థాలు పలకరిస్తాయి. అలకలూ ఉంటాయి. వాటిని దాటితేనే బంధం పదిలంగా మారుతుంది. అభిప్రాయ భేదాలు వచ్చి అలిగినా తెగేదాకా లాగొద్దు. పరోక్ష వ్యాఖ్యానాలు చేయొద్దు. నేరుగానే పరిష్కరించుకోండి. సమస్య ఏదైనా ఎదుటివారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. లేదంటే సమస్య పరిష్కారం కాకపోగా అవతలివారిలో రోజు రోజుకీ అసంతృప్తి పెరిగిపోతుంది.
News November 17, 2025
వేరుశనగ పంట కోత.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వేరుశనగ పంట కోత సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కలను పీకేటప్పుడు నేల గుల్లగా ఉండేలా చూసుకోవాలి. పంటలో 70 నుంచి 80 శాతం మొక్కల ఆకులు, కొమ్మలు పసుపు రంగులోకి మారి, కాయడొల్ల లోపల భాగం నలుపు రంగులోకి మారినప్పుడే పంటను కోయాలి. కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. మొక్క నుంచి కాయలను వేరుచేశాక కాయలను నిల్వచేసినప్పుడు, బూజుతెగులు రాకుండా స్థానిక వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలి.
News November 17, 2025
VIRAL: ప్రభాస్ లేటెస్ట్ లుక్

పాన్ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ లుక్ ఫొటోలు వైరలవుతున్నాయి. ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR, నటుడు సుబ్బరాజుతో కలిసి ఫొటోలు దిగారు. ఎప్పుడూ తలకు క్లాత్ ధరించి కనిపించే ఆయన చాలారోజుల తర్వాత ఇలా దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఆయన ‘రాజాసాబ్’, ‘స్పిరిట్’, ‘ఫౌజీ’ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.


