News March 19, 2024
ఎన్నికల సమయంలో జనంలోనే జగన్: సజ్జల

AP: వైసీపీ నిర్వహించిన ‘సిద్ధం’ సభలకు అనుహ్య స్పందన వచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 28న నంద్యాల, 30న కర్నూలు(ఎమ్మిగనూరు)లో బస్సుయాత్ర, బహిరంగ సభలు ఉంటాయని తెలిపారు. ఉదయం ఇంటరాక్షన్ కార్యక్రమాలు, సాయంత్రం సభలు నిర్వహిస్తామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనంతగా సభలు ఉంటాయన్నారు. వైసీపీ సంక్షేమాన్ని ప్రజలకు చేరవేస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో సీఎం జగన్ జనంలోనే ఉంటారన్నారు.
Similar News
News October 17, 2025
హిందూ అమ్మాయిలు జిమ్కు వెళ్లవద్దు: బీజేపీ ఎమ్మెల్యే

మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే గోపిచంద్ పడల్కర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘దయచేసి హిందూ అమ్మాయిలు జిమ్కు వెళ్లొద్దు. అక్కడ మీ ట్రైనర్ ఎవరో తెలియదు. మంచిగా మాట్లాడే వ్యక్తిని చూసి మోసపోకండి. అర్థం చేసుకోండి. ఇంట్లోనే యోగా ప్రాక్టీస్ చేసుకోండి’ అని బీడ్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.
News October 17, 2025
509 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై చేశారా?

ఢిల్లీ పోలీస్ విభాగంలో 509 హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 3 రోజులే (OCT 20) సమయం ఉంది. ఇంటర్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పురుషులకు 341, మహిళలకు 168 జాబ్లు ఉన్నాయి. వయసు 18- 25 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష, PE&MT, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 17, 2025
రేపు రాష్ట్ర బంద్.. స్కూళ్లు, బస్సులు నడుస్తాయా?

TG: రేపు రాష్ట్ర బంద్కు కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రేపు బంద్ సంపూర్ణంగా ఉంటుందని అంచనా. ఇప్పటికే పలు ప్రైవేట్ స్కూళ్లు రేపు సెలవు ప్రకటిస్తూ తల్లిదండ్రులకు మెసేజ్లు పంపుతున్నాయి. కాగా దీపావళి నేపథ్యంలో ఉదయం దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు Way2Newsకు వెల్లడించారు. అంతర్రాష్ట్ర బస్సులు మధ్యాహ్నం తర్వాత యథావిధిగా నడిచే ఛాన్సుంది.