News November 15, 2024

జగన్ ఆర్థిక ఉగ్రవాది: మంత్రి పయ్యావుల

image

AP: ఐదేళ్ల పాలలో జగన్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని, ఆయనొక ఆర్థిక ఉగ్రవాది అని మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో విమర్శించారు. రాష్ట్ర సంపద పెంచకుండా విపరీతంగా అప్పులు చేశారని దుయ్యబట్టారు. ‘బిల్లులను పెండింగ్‌లో పెట్టడంతో అనేకమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టారు. పోలవరం పనులు నిలిపేసి డయాఫ్రంవాల్ డ్యామేజీకి జగన్ కారణమయ్యారు’ అని ఆరోపించారు.

Similar News

News November 8, 2025

ఒలింపిక్స్‌కు క్రికెట్ జట్ల ఎంపిక ఇలా..

image

LA-2028 ఒలింపిక్స్‌లో ఆడే క్రికెట్ జట్ల ఎంపికను ICC పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఖండాలవారీగా ర్యాంకింగ్‌లోని టాప్‌ జట్లు ఆడనున్నాయి. IND(ఆసియా), SA(ఆఫ్రికా), ENG(యూరప్), AUS(ఓషియానియా), ఆతిథ్య జట్టుగా USA/WI ఎంపికవుతాయి. ఆరవ జట్టుగా గ్లోబల్ క్వాలిఫయర్‌ ఎంపిక బాధ్యత అమెరికాపై ఉండనుంది. ఈ విధానం వల్ల ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న జట్టుకూ అవకాశం దక్కకపోవచ్చు. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.

News November 8, 2025

ప్లాస్టిక్ డబ్బాల్లో ఫుడ్ పెడుతున్నారా?

image

ప్లాస్టిక్ డ‌బ్బాల్లో ఆహారాన్ని నిల్వ చేయడం సర్వసాధారణం. కానీ వీటిలో వేడి పదార్థాలు, నూనెలు, ఆమ్ల స్వభావం గ‌ల ఆహారాలను పెడితే ఆరోగ్యానికి హాని చేస్తాయంటున్నారు నిపుణులు. ఆహారాన్ని నిల్వ చేయడానికి.. గాజు, స్టెయిన్‌లెస్ స్టీల్, సిలికాన్, బీస్‌వాక్స్, వెదురుతో చేసినవి వాడొచ్చు. అవ‌న్నీ విష‌ర‌హిత ప‌దార్థాల‌తో త‌యారు చేయ‌డం వ‌ల్ల.. ప్లాస్టిక్​కు ప్రత్యామ్నాయంగా వాటిని వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

News November 8, 2025

ఏపీ న్యూస్ అప్డేట్స్

image

* సీఎం చంద్రబాబు అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తర్వాత జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ ఎంపికపై సీనియర్ నేతలతో చర్చించారు.
* అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శ్రీభక్త కనకదాసు జయంతి ఉత్సవాల్లో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. తత్వవేత్తగా, స్వరకర్తగా సమాజ చైతన్యానికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆదరణ పథకం కింద పేదలకు పనిముట్లు అందిస్తామని చెప్పారు.