News January 14, 2025
లండన్ పర్యటనకు బయలుదేరిన జగన్

మాజీ సీఎం వైఎస్ జగన్ లండన్ పర్యటనకు బయలుదేరారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి ఆయన లండన్ పర్యటనకు వెళ్లినట్టు తెలుస్తోంది. జగన్ రెండో కుమార్తె వర్షారెడ్డి King’s College Londonలో ఎంఎస్, ఫైనాన్స్ కోర్సులో డిస్టింక్షన్లో ఉత్తీర్ణులయ్యారు. ఆమె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమానికి జగన్ దంపతులు హాజరుకానున్నారు. 16న డిగ్రీ ప్రదానోత్సవం జరగనుంది. అనంతరం నెలాఖరున జగన్ లండన్ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.
Similar News
News February 16, 2025
మళ్లీ వస్తున్నాం: తెలుగులో Delhi Capitals ట్వీట్

IPL-2025లో Delhi Capitals 2 మ్యాచ్లు విశాఖపట్నంలో ఆడనుంది. ఈ నేపథ్యంలో ‘మళ్లీ వస్తున్నాం. వైజాగ్కు మాకు ప్రత్యేక అనుబంధం ఉంది’ అని తెలుగులో ట్వీట్ చేసింది. APలోని రాజాంకు చెందిన GMR గ్రూప్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు కుమారుడే ఢిల్లీ జట్టు కోఓనర్ కిరణ్ కుమార్. ఆయన ప్రస్తుతం GMR ఎయిర్పోర్ట్స్కు కార్పొరేట్ ఛైర్మన్గా ఉన్నారు. సొంత రాష్ట్రంపై అభిమానంతో 2వ హోం వెన్యూగా వైజాగ్ను ఎంచుకున్నారు.
News February 16, 2025
రేపు తిరుపతికి సీఎం చంద్రబాబు

AP: తిరుపతిలో రేపు అంతర్జాతీయ దేవాలయాల సమ్మేళనం జరగనుంది. సీఎం చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా వీరు ముగ్గురు టెంపుల్ ఎక్స్పోను ప్రారంభిస్తారు. ఎక్స్పోలో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు, వర్క్షాపులు నిర్వహించనున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో 100 ఆలయాలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు.
News February 16, 2025
G-PAY వాడే వారికి శుభవార్త

గూగుల్ పేలో త్వరలోనే AI ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా యూజర్లు వాయిస్ కమాండ్లతోనే UPI లావాదేవీలు చేయవచ్చు. ప్రస్తుతం సంస్థ దీనిపై ప్రయోగాలు చేస్తుండగా, త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా చదువులేని వారు కూడా సులభంగా లావాదేవీలు చేయవచ్చని సంస్థ అంచనా వేస్తోంది. అన్ని భారతీయ భాషలను ఇందులో ఇంక్లూడ్ చేసేలా గూగుల్ ప్రయత్నాలు చేస్తోంది.