News November 19, 2024
విధుశేఖర భారతీ స్వామీజీని కలిసిన జగన్

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విజయవాడలో పర్యటించారు. గాంధీనగర్ బీఆర్టీఎస్ రోడ్లోని శృంగేరీ శారదా పీఠంలో జగద్గురు విధుశేఖర భారతీ స్వామీజీని కలిసిన ఆయన ఆశీర్వచనం తీసుకున్నారు. జగన్ వెంట ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ భరత్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాశ్ ఉన్నారు. అంతకముందు జగన్ అభిమానులు పెద్దసంఖ్యలో ఆయనకు స్వాగతం పలికారు.
Similar News
News December 3, 2025
సరికొత్త ఆవిష్కరణలకు పట్టం కట్టాలి: పవన్

AP: సరికొత్త ఆవిష్కరణలకు పట్టం కట్టాలని, ఆవిష్కర్తలను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని Dy.CM పవన్ అన్నారు. అవసరమైతే MSME పార్కుల్లో వీరికి ప్రాధాన్యత ఇచ్చే అంశంపై CMతో చర్చిస్తామని శాస్త్ర, సాంకేతిక శాఖ సమీక్షలో తెలిపారు. ‘అవసరాలకు తగినట్లు మనమే వస్తువులు తయారు చేసుకోవాలి. మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా లక్ష్యం అదే. దిగుమతుల మీద ఆధారపడడం తగ్గిస్తే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది’ అని చెప్పారు.
News December 3, 2025
నవంబర్ అంటే నాకు భయం: రామ్

నవంబర్ అంటే తనకు భయమని హీరో రామ్ అన్నారు. గతంలో ఇదే నెల రిలీజైన ‘మసాలా’కు కలెక్షన్లు రాలేదని చెప్పారు. కానీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’పై ఉన్న నమ్మకంతోనే ఆ భయాన్ని పక్కనపెట్టినట్లు వివరించారు. ఇది గొప్ప సినిమా అని ప్రేక్షకులు వెంటనే తెలుసుకుంటారా? లేట్ అవుతుందా? అనే దానిపై చర్చించుకున్నట్లు చెప్పారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా డే-1లోనే కలెక్షన్లు కొట్టేస్తుందని అనుకోలేదని థ్యాంక్స్ మీట్లో తెలిపారు.
News December 3, 2025
చిన్న తప్పుతో రూ.లక్షలు కోల్పోతున్నారు!

సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్తో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ‘FLAT SIP’ హ్యాబిట్తో రూ.లక్షలు కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు. ‘ఎప్పుడూ ఒకే అమౌంట్ని ఇన్వెస్ట్ చేయకూడదు. పెట్టుబడి మొత్తంలో ఏడాదికి కనీసం 10% పెంచాలి. Ex: నెలకు ₹10వేలు చొప్పున 20ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే (12% రిటర్న్స్తో) ₹99 లక్షలొస్తాయి. అదే ఏటా 10% పెంచుకుంటూ పోతే ₹1.5కోట్ల వరకు వస్తాయి’ అని వివరిస్తున్నారు.


