News March 18, 2024
ప్రాంతీయ సమన్వయకర్తలతో జగన్ భేటీ

AP: వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తల(రీజినల్ కోఆర్డినేటర్లు)తో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఎదుర్కొనే కార్యాచరణపై చర్చిస్తున్నారు. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితులపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ మేనిఫెస్టో అంశాలు, బస్సు యాత్రపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Similar News
News November 12, 2025
దేశవాళీ ఆడాల్సిందే.. RO-KOకు బీసీసీఐ అల్టిమేటం?

కోహ్లీ, రోహిత్ వన్డే భవిష్యత్తుపై BCCI కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వారు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని, లేదంటే జట్టులో చోటు కష్టమేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో తాను విజయ్ హజారే ట్రోఫీలో ఆడతానని హిట్మ్యాన్ MCAకు సమాచారం అందించినట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి. కోహ్లీ ఆడటంపై ఇంకా క్లారిటీ రాలేదు. T20, టెస్టులకు వీడ్కోలు పలికిన RO-KO వన్డేల్లో మాత్రం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
News November 12, 2025
సివిల్స్ ఫలితాలు విడుదల

ఆగస్టు 22 నుంచి 31 వరకు జరిగిన సివిల్ సర్వీసెస్(మెయిన్) ఎగ్జామినేషన్ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. 2,736 మంది మెయిన్స్ క్లియర్ చేశారు. https://upsc.gov.in/, https://www.upsconline.gov.inలో ఎంపికైన వారి ర్యాంక్, పేర్లతో జాబితాను ఉంచారు. వీరికి పర్సనాలిటీ టెస్టు నిర్వహించి ర్యాంకుల ఆధారంగా IAS, IPS, IFS సహా పలు రకాల సెంట్రల్ సర్వీసెస్లు కేటాయిస్తారు.
News November 12, 2025
‘Mom my first love’.. టాటూ చూసి డెడ్బాడీ గుర్తింపు

ఢిల్లీ బ్లాస్ట్లో మరణించిన వారి డెడ్బాడీలను గుర్తించడం కష్టతరంగా మారింది. టాటూలు, టీ షర్టు ఆధారంగా తమ ఆత్మీయుల మృతదేహాలను గుర్తించారు. చాందినీ చౌక్లో ఫార్మా బిజినెస్ చేసే 34 ఏళ్ల అమర్ కటారియా బ్లాస్ట్లో మరణించాడు. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న అతని డెడ్బాడీని చేతిపై ఉన్న ‘Mom my first love’, ‘Dad my strength’ టాటూల ఆధారంగా సోమవారం రాత్రి మార్చురీలో కుటుంబసభ్యులు గుర్తించారు.


