News March 18, 2024
ప్రాంతీయ సమన్వయకర్తలతో జగన్ భేటీ

AP: వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తల(రీజినల్ కోఆర్డినేటర్లు)తో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఎదుర్కొనే కార్యాచరణపై చర్చిస్తున్నారు. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితులపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ మేనిఫెస్టో అంశాలు, బస్సు యాత్రపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Similar News
News December 24, 2025
మెరుపు డెలివరీ వెనుక మైండ్ గేమ్!

క్విక్ కామర్స్ సంస్థలు మెరుపు వేగంతో డెలివరీ చేస్తూ ప్రజల జీవనశైలిని మారుస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డేటా అనలిటిక్స్ టెక్నాలజీని వాడి ఈ యాప్స్ మీ అవసరాలను ముందే అంచనా వేస్తాయి. ఆర్డర్ చేయగానే ‘డార్క్ స్టోర్స్’లో సిద్ధంగా ఉన్న వస్తువులను ప్యాక్ చేసి 10ని.ల్లో డెలివరీ చేస్తాయి. వీటివల్ల ప్రజల్లో ఓపిక తగ్గిపోవడంతో పాటు వస్తువులను నిల్వ చేసుకునే ప్రణాళికాబద్ధమైన అలవాటు కనుమరుగవుతోంది.
News December 24, 2025
VHT: భారీ విజయం.. 397 పరుగుల తేడాతో

VHTలో అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచులో బిహార్ 397 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆ టీమ్ వైభవ్, ఆయుశ్, గనిల శతకాల విధ్వంసంతో 50 ఓవర్లలో <<18657571>>574<<>> రన్స్ చేసింది. ఛేదనలో అరుణాచల్ 177 పరుగులకే ఆలౌటైంది. దీంతో VHT చరిత్రలో పరుగుల పరంగా రెండో అతిపెద్ద విజయం నమోదైంది. 2022లో అరుణాచల్ ప్రదేశ్పైనే తమిళనాడు 435 రన్స్ తేడాతో గెలిచింది.
News December 24, 2025
కేసీఆర్ పాలనలో పాలమూరును ఎండబెట్టారు: రేవంత్

TG: నీటి ప్రాజెక్టుల అంశంలో KCRకు CM రేవంత్ మరోసారి కౌంటర్ ఇచ్చారు. ‘ప్రత్యేక రాష్ట్రం వస్తే నీటి సమస్య తీరుతుందని అంతా అనుకున్నాం. కానీ KCR పాలనలో ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. పదేళ్లలో పాలమూరును ఎండబెట్టారు. కేసీఆర్ వలస వచ్చి పాలమూరు ఎంపీగా, తర్వాత సీఎం అయ్యారు. కానీ పాలమూరుకు నీళ్లు రాలేదు. పదేళ్లలో రూ.వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారు. ఫామ్హౌస్లు కట్టుకున్నారు’ అని కొడంగల్ సభలో ఆరోపించారు.


