News July 30, 2024
జగన్ కోర్టులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి: వర్ల రామయ్య

AP: వైసీపీ అధినేత జగన్ ఢిల్లీకి వెళ్లి ఏదో చేయాలని చూసి అబాసు పాలయ్యారని టీడీపీ నేత వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. ఆయన పెద్ద అబద్దాల కోరు అని మండిపడ్డారు. ‘జగన్ రూ.43వేల కోట్లు కొట్టేశారని సీబీఐ చెప్పింది. అందుకే 16 నెలలు బెయిల్ రాలేదు. 11 కేసుల్లో ఛార్జిషీట్లు ఎదుర్కొంటున్న ఆయనకు మాట్లాడే నైతిక హక్కులేదు. ఆయన కోర్టులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News December 27, 2025
డేట్ మార్చారు.. రేటు పెంచారు: ఎక్స్పైర్డ్ ఫుడ్తో ఆటలు!

UK, US, దుబాయ్ నుంచి తక్కువ ధరకు Expired ఫుడ్ తెప్పించి ఫ్రెష్ ఐటమ్స్గా అమ్ముతున్న భారీ ముఠాను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. దాదాపు ₹4.3 కోట్ల విలువైన పాపులర్ బ్రాండ్ల ప్రోడక్ట్స్ సీజ్ చేశారు. కొత్త MRP, Barcodes వేసి టాప్ స్టోర్స్తో పాటు ఆన్లైన్లో అమ్మేస్తున్నారు. దీని వెనుక ఉన్న మాస్టర్మైండ్ అటల్ జైస్వాల్తో పాటు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
News December 27, 2025
ఉల్లి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

AP: ఈ ఏడాది సరైన ధరలు లేక, వాతావరణం అనుకూలించక ఉల్లి రైతులకు భారీ నష్టాలు మిగిలాయి. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. అర్హులైన వారికి పరిహారం అందిచేందుకు రూ.128 కోట్లు విడుదల చేసింది. హెక్టారుకు రూ.20 వేల చొప్పున ఈ సాయం అందించనుంది. ఈ-క్రాప్ ఐడీ ఆధారంగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కర్నూలు, కడప జిల్లాల్లో ఇప్పటికే 37,752మంది రైతులకు పరిహారం అందజేశారు.
News December 27, 2025
జనరేషన్ బీటా గురించి తెలుసా?

2025 జనవరి 1 నుంచి 2039 డిసెంబర్ 31 వరకు పుట్టే పిల్లలందరినీ ‘జనరేషన్ బీటా’గా పిలుస్తారు. ఈ తరం పూర్తిగా AI ప్రపంచంలో పెరగనుంది. భారత్లో మొదటి బీటా బేబీ మిజోరంలో పుట్టింది. ఇలా జనరేషన్స్కు పేర్లు పెట్టడం 1901లో ప్రారంభమైంది. జనరేషన్ బీటాకు ముందు జనరేషన్ X (1965-80), జనరేషన్ Y లేదా మిలీనియల్స్(1981-1996), జనరేషన్ Z (1997-2009), జనరేషన్ ఆల్ఫా (2010-2024)లు ఉన్నాయి. ఇంతకీ మీరు ఏ జనరేషన్?


