News July 30, 2024

జగన్ కోర్టులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి: వర్ల రామయ్య

image

AP: వైసీపీ అధినేత జగన్ ఢిల్లీకి వెళ్లి ఏదో చేయాలని చూసి అబాసు పాలయ్యారని టీడీపీ నేత వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. ఆయన పెద్ద అబద్దాల కోరు అని మండిపడ్డారు. ‘జగన్ రూ.43వేల కోట్లు కొట్టేశారని సీబీఐ చెప్పింది. అందుకే 16 నెలలు బెయిల్ రాలేదు. 11 కేసుల్లో ఛార్జిషీట్లు ఎదుర్కొంటున్న ఆయనకు మాట్లాడే నైతిక హక్కులేదు. ఆయన కోర్టులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి’ అని డిమాండ్ చేశారు.

Similar News

News December 30, 2025

జనవరి నుంచే అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్!

image

TG: కొత్త ఏడాదిలో జనవరి మొదటివారం నుంచే అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను ప్రభుత్వం ప్రారంభించనుంది. HYDలో చేపట్టనున్న పైలట్ ప్రాజెక్ట్‌ను మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైంది. టీజీ ఫుడ్స్ ద్వారా రెడీ టు ఈట్ పద్ధతిలో ఆహారాన్ని అందించనున్నారు. ఒక రోజు కిచిడీ, మరొక రోజు ఉప్మా ఇవ్వనున్నారు. రాష్ట్రంలో 35,781 అంగన్‌వాడీ సెంటర్లలో 8 లక్షల మంది చిన్నారులు ఉన్నారు.

News December 30, 2025

బంగ్లా మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత

image

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, BNP చీఫ్ ఖలీదా జియా (80) మరణించారు. గత కొన్ని రోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. ఇటీవలే ఆమె కుమారుడు తారిఖ్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి చేరుకున్నారు. జియా పదేళ్ల పాటు (1991-96, 2001-06) బంగ్లా ప్రధానిగా పని చేశారు.

News December 30, 2025

DANGER: అరటి తోటల్లో ఈ మందు పిచికారీ చేస్తున్నారా?

image

అరటి తోటల్లో కలుపు ప్రధాన సమస్య. దీని కట్టడికి వ్యవసాయ నిపుణులు గ్లూఫోసినేట్ అమ్మోనియం, పారాక్వాట్ సహా పలు కలుపు మందులను సిఫార్సు చేస్తున్నారు. అయితే కొందరు రైతులు అవగాహన లేక 2,4-D రసాయనాన్ని కలుపు మందుగా అరటిలో వాడుతున్నారు. దీని వల్ల పంటకు తీవ్ర నష్టం జరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ మందుతో పంటకు కలిగే నష్టమేంటో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.