News July 30, 2024
జగన్ కోర్టులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి: వర్ల రామయ్య

AP: వైసీపీ అధినేత జగన్ ఢిల్లీకి వెళ్లి ఏదో చేయాలని చూసి అబాసు పాలయ్యారని టీడీపీ నేత వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. ఆయన పెద్ద అబద్దాల కోరు అని మండిపడ్డారు. ‘జగన్ రూ.43వేల కోట్లు కొట్టేశారని సీబీఐ చెప్పింది. అందుకే 16 నెలలు బెయిల్ రాలేదు. 11 కేసుల్లో ఛార్జిషీట్లు ఎదుర్కొంటున్న ఆయనకు మాట్లాడే నైతిక హక్కులేదు. ఆయన కోర్టులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News December 3, 2025
ప్రజలను కేంద్రం దగా చేస్తోంది: రాహుల్ గాంధీ

కుల గణనపై కేంద్రం తీరును రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ‘పార్లమెంటులో కుల గణనపై నేనో ప్రశ్న అడిగా. దానికి కేంద్రం ఇచ్చిన సమాధానం విని షాకయ్యాను. సరైన ఫ్రేమ్ వర్క్ లేదు, టైమ్ బౌండ్ ప్లాన్ లేదు, పార్లమెంట్లో చర్చించలేదు, ప్రజలను సంప్రదించలేదు. కులగణనను విజయవంతంగా చేసిన రాష్ట్రాల నుంచి నేర్చుకోవాలని లేదు. క్యాస్ట్ సెన్సస్పై మోదీ ప్రభుత్వ తీరు దేశంలోని బహుజనులను దగా చేసేలా ఉంది’ అని ట్వీట్ చేశారు.
News December 3, 2025
NIEPMDలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిఫుల్ డిజబిలిటీస్ (NIEPMD) 25 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు DEC 26వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG, B.Ed, M.Ed (Spl.edu), PhD, M.Phil, PG( సైకాలజీ, ఆక్యుపేషనల్ థెరపీ), డిగ్రీ (ప్రోస్థెటిక్స్&ఆర్థోటిక్స్), B.Com, M.Com, MBA, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://niepmd.nic.in
News December 3, 2025
జీడిమామిడిలో టీ దోమ పూర్తి నివారణకు సూచనలు

జీడిమామిడి కొత్త చిగురు వచ్చే సమయంలో లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6ml కలిపి పిచికారీ చేయాలి. పూత వచ్చాక లీటరు నీటికి లాంబ్డాసైహలోథ్రిన్ 0.6ml లేదా క్లోరీపైరిఫాస్ 2mlను కలిపి పిచికారీ చేయాలి. గింజ బటాని సైజులో ఉన్నప్పుడు లీటరు నీటికి ప్రోఫెనోఫోస్ 1ml కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులను మార్చి నెల వరకు అవసరాన్నిబట్టి 2 లేక 3 సార్లు కాండం, కొమ్మలు, ఆకులు, చిగుర్లు, పూత, పిందే తడిచేలా పిచికారీ చేయాలి.


