News January 3, 2025

లండన్ పర్యటన కోసం కోర్టులో జగన్ పిటిషన్

image

AP: లండన్ పర్యటనకు అనుమతి కోరుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జనవరి 11 నుంచి 25 వరకు కుటుంబసమేతంగా వెళ్లే ఈ టూర్‌కు అనుమతించాలని జగన్ కోరారు. దీనిపై సీబీఐ కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. సీబీఐ కౌంటర్ తర్వాత ఈ పిటిషన్‌పై కోర్టు వాదనలు విననుంది.

Similar News

News November 28, 2025

సర్పంచ్ ఎన్నికలపై స్టే విధించలేం: హైకోర్టు

image

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన <<18403510>>జీవో 46ను<<>> సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ దశలో సర్పంచ్ ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక కోర్టుల జోక్యం ఉండదన్న ఈసీ తరఫు లాయర్ల వాదనలతో ఏకీభవించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను 2 నెలలకు వాయిదా వేసింది.

News November 28, 2025

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్‌పై రేప్ కేసు నమోదు

image

కేరళ పాలక్కాడ్ కాంగ్రెస్ MLA రాహుల్ మామ్‌కూటత్తిల్‌పై అత్యాచార కేసు నమోదైంది. ఆయన తనను రేప్ చేసి గర్భం దాల్చాక అబార్షన్ చేయించుకోవాలని బెదిరించాడని ఓ యువతి CM విజయన్‌కు ఫిర్యాదు చేశారు. వీరిద్దరి మధ్య ఆడియో రికార్డులు, చాటింగ్ స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే తాను ఏ తప్పూ చేయలేదని, చట్టపరంగా కేసును ఎదుర్కొంటానని MLA చెప్పారు. కాగా రాహుల్‌ ప్రాథమిక సభ్యత్వాన్ని INC రద్దు చేసింది.

News November 28, 2025

తులసి ఆకులను నమలకూడదా?

image

తులసి ఔషధ గుణాలు కలిగిన మొక్కగా గుర్తింపు పొందింది. అయితే ఈ మొక్క ఆకులను నమలకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. తులసి ఆకుల్లో ఆర్సెనిక్ అనే రసాయనం ఉంటుంది. ఇది పంటిపై ఉన్న ఎనామెల్‌ను దెబ్బతీస్తుంది. ఫలితంగా పళ్ల రంగు మారవచ్చు. అయితే ఆకులను నమలకుండా మింగితే ఎన్నో రోగాలు నయమవుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. జలుబు, దగ్గుతో పోరాడి తులసి క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది.