News April 11, 2024

జగన్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపారు: CBN

image

AP: జగన్ పాలనలో రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని.. కాపాడుకోకపోతే రాష్ట్రాన్ని శాశ్వతంగా దక్కించుకోలేమని చంద్రబాబు అన్నారు. ‘ఆరోగ్య శ్రీ కింద వైద్యం పడకేసింది. బటన్ నొక్కింది ఎంత? వైసీపీ వాళ్లు దోచింది ఎంత? భూపరిరక్షణ చట్టం పేరుతో ప్రజల భూమిని తాకట్టు పెట్టి ఇతరులకు బదిలీ చేసే ప్రమాదం ఉంది. జగన్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపారు. మద్యం తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లు తెచ్చారు’ అని ఆరోపించారు.

Similar News

News January 16, 2026

వరుసగా అబార్షన్లు అవుతున్నాయా?

image

గర్భం దాల్చిన ప్రతిసారీ అబార్షన్ అవుతుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రెండోసారి అబార్షన్ జరిగితే డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని టెస్టులు చేయించి మందులు వాడాలి. గర్భస్రావం జరిగినప్పుడు పిండాన్ని టెస్టుకి పంపి జన్యు సమస్యలున్నాయో తెలుసుకోవచ్చు. మేనరికం అయితే దంపతులకి టెస్టులు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు రక్తపరీక్షలు, స్కానింగ్ వంటివి చేసి వాటికి తగ్గ ట్రీట్‌మెంట్ చేయాలి.

News January 16, 2026

‘కనుమ నాడు కాకులు కూడా కదలవు’

image

‘కనుమ నాడు కాకులు కూడా కదలవు’అనేది సామెత. ఇవాళ ఎలాంటి ప్రయాణాలు చేయకూడదంటారు పెద్దలు. దీనికి కారణం పూర్వం ఎడ్ల బండ్ల మీదే ప్రయాణాలు జరిగేవి. కనుమ రోజు పశువులను పూజించి ఏడాదిలో ఈ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా బండ్లు కట్టొద్దని నిర్ణయించారు. అందుకే ఈ రోజున ప్రయాణాలు వద్దంటారు. అంతే కాకుండా భోగి, సంక్రాంతి హడావుడిగా అయిపోతాయి. అందరూ కలిసి సరదాగా గడపడం కోసం కూడా కనుమ రోజు తిరుగు ప్రయాణం వద్దంటారు.

News January 16, 2026

ట్రంప్ కొంతైనా ‘శాంతి’స్తారా?

image

అధికారికంగా కాకపోయినా ట్రంప్‌ చేతికి <<18868941>>నోబెల్ పీస్ ప్రైజ్<<>> అందింది. దీంతో కొంతైనా శాంతించి ఉంటారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు మచాడో వెనిజులా అధ్యక్షురాలు అవుతారని కొందరు, ఆమెకు ఇచ్చిన బహుమతిని వెనక్కి తీసుకోవాలని మరికొందరు స్పందిస్తున్నారు. కాగా తనకు కాకుండా వెనిజులాకు చెందిన వ్యక్తికి నోబెల్ ప్రైజ్ రావడంతోనే ఆ దేశంపై దాడి చేసి అధ్యక్షుడిని అరెస్ట్ చేశారని ట్రంప్‌పై తీవ్ర విమర్శలొచ్చాయి.