News April 21, 2024
జగన్ రెడ్డి ఓ మూర్ఖుడు: పవన్

AP: ప్రతీ రోజు ముగ్గురు భార్యలు అంటూ హేళన చేస్తున్న సీఎం జగన్ ఓ మూర్ఖుడు అని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ‘ఎప్పుడు చూసినా జగన్ నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతారు. మాట్లాడితే ముగ్గురు పెళ్లాలు అంటారు. అందరి ఇళ్లలో విభేదాలు ఉంటాయి. నా ఇంట్లో కూడా అలానే విభేదాలు ఉన్నాయి. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం ఏంటీ? నా వ్యక్తిగత విషయాల జోలికి వస్తే తాట తీస్తా’ అని ఆయన మండిపడ్డారు.
Similar News
News March 10, 2026
క్షమాపణ కోరిన NCERT

8వ తరగతి పుస్తకంలో <<19253509>>‘న్యాయ వ్యవస్థలో అవినీతి’<<>> పాఠ్యాంశంపై వివాదం చెలరేగడంతో NCERT బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పింది. ఇప్పటికే ఆ పుస్తకాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది. ఈ పుస్తకంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ దాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ కూడా ఆ పాఠ్యాంశంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
News March 10, 2026
రాష్ట్రంలో ఈవినింగ్ బీటెక్ కోర్సులు

TG: సాయంత్రం వేళల్లో తరగతులు నిర్వహించేలా బీటెక్, ఎంటెక్ కోర్సులకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ విద్యాసంవత్సరం నుంచే 12 ప్రైవేట్ కాలేజీల్లో ఒకటి నుంచి 5 కోర్సులకు అనుమతించింది. ఒక్కో కళాశాలలో గరిష్ఠంగా 60 సీట్లు ఉంటాయి. పాలిటెక్నిక్ పూర్తి చేసి ఏడాది ఉద్యోగ అనుభవం ఉన్నవారు ఈ కోర్సుల్లో చేరవచ్చు. దీనివల్ల ఎంతో మందికి మేలు జరగనుంది. రెగ్యులర్ కోర్సులకు ఉన్న ఫీజునే చెల్లించాలి.
News March 10, 2026
మెగా కోడలికి ఆన్లైన్ వేధింపులు.. కేసు నమోదు

తనపై ఓ వ్యక్తి SMలో వేధింపులకు పాల్పడుతున్నాడంటూ నటి, మెగా కోడలు లావణ్య త్రిపాఠి HYD సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘నా వ్యక్తిగత జీవితం, గౌరవాన్ని దెబ్బతీసేలా ‘Purple Crayon00’ ఇన్స్టా ఖాతా ద్వారా పోస్టులు, కామెంట్లు చేస్తున్నాడు. నా కుటుంబీకులనూ దూషిస్తూ అవమానిస్తున్నాడు. అతడిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ఆమె పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


