News July 5, 2024

ఖైదీని కలిసేందుకు జగన్ రూ.25 లక్షలు ఖర్చు చేశారు: హోం మంత్రి

image

AP: పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి మాజీ సీఎం జగన్ రూ.25 లక్షలు ఖర్చు చేశారని హోం మంత్రి అనిత ఆరోపించారు. హెలికాప్టర్‌లో జగన్ నెల్లూరు జైలుకు వెళ్లారన్నారు. పిన్నెల్లిని కలిసేందుకు ములాఖత్‌లు అయిపోయినా.. మానవతా దృక్పథంతో జగన్‌కు అనుమతిచ్చామన్నారు. పిన్నెల్లి ఈవీఎంలు పగులగొట్టడం, దాడులు చేయడం సీసీ టీవీల్లో రికార్డయ్యాయని.. అయినా జగన్ అక్రమంగా అరెస్ట్ చేశారనడం దారుణమన్నారు.

Similar News

News March 29, 2026

భూభారతి ద్వారా ₹12,443కోట్ల విలువైన రిజిస్ట్రేషన్లు: ప్రభుత్వం

image

TG: భూభారతి పోర్టల్‌లో లావాదేవీల ద్వారా ₹1,518.64కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పోర్టల్‌లో 6.17లక్షల రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్స్ జరిగాయని.. జనవరి నాటికి ₹12,443.64కోట్ల విలువైన రిజిస్ట్రేషన్స్ జరిగినట్లు తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం ₹16,021కోట్లకు చేరాలన్నదే తమ లక్ష్యమని పేర్కొంది. కాగా ధరణిని భర్తీ చేస్తూ గత ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం లాంచ్ భూభారతి చేసింది.

News March 29, 2026

నేడు MI vs KKR

image

ఐపీఎల్‌ 2026లో ఈరోజు రెండో మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఇప్పటివరకు ఈ జట్లు 35సార్లు తలపడగా ఇందులో 24 విజయాలతో ముంబైదే పైచేయి. ఇక MI vs KKR మ్యాచ్ హిస్టరీలో హైయెస్ట్ స్కోర్ (232), లోయెస్ట్ స్కోర్ (67) కూడా కేకేఆర్ పేరునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. రా.7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

News March 29, 2026

నేడు MI vs KKR

image

ఐపీఎల్‌ 2026లో ఈరోజు రెండో మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఇప్పటివరకు ఈ జట్లు 35సార్లు తలపడగా ఇందులో 24 విజయాలతో ముంబైదే పైచేయి. ఇక MI vs KKR మ్యాచ్ హిస్టరీలో హైయెస్ట్ స్కోర్ (232), లోయెస్ట్ స్కోర్ (67) కూడా కేకేఆర్ పేరునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. రా.7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.