News November 29, 2024
జగన్.. బైబిల్పై ప్రమాణం చేయండి: షర్మిల

అబద్ధాలను అందంగా అల్లడంలో మాజీ సీఎం జగన్కు ఆస్కార్ ఇవ్వొచ్చని YS షర్మిల అన్నారు. ‘2021, మే నెలలో సెకీ వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా ₹2.14 ఉంది. గుజరాత్ ₹1.99కే కొంటే మీరు 50 పైసలు ఎక్కువ పెట్టి ₹2.49కు కొన్నారు. ఇందుకోసం మీకు శాలువాలు కప్పి సన్మానాలు చేయాలా? మీరు అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేయండి. దమ్ముంటే జగన్ ఈ సవాల్ను స్వీకరించాలి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 22, 2026
HYDలో ‘స్విస్ మాల్’ పెట్టండి: CM రేవంత్

స్విట్జర్లాండ్లోని వాడ్ కాంటన్ CM క్రిస్టెల్ లూసియర్ బ్రోడార్డ్ను సీఎం రేవంత్ దావోస్లో కలిశారు. HYDలో ‘స్విస్ మాల్’ ఏర్పాటు ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. సంస్కృతి, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. మహిళల ఆర్థిక సాధికారతలో స్వయం సహాయక బృందాల(SHG) పాత్రను CM వారికి వివరించారు. వాడ్ ప్రతినిధులు త్వరలో TGకు వచ్చి SHG మోడల్ను అధ్యయనం చేస్తామని తెలిపారు.
News January 22, 2026
ENE2లో సుశాంత్ చేయట్లేదు: తరుణ్ భాస్కర్

ఈ నగరానికి ఏమైంది రిపీట్(ENE2)లో సాయి సుశాంత్(కార్తిక్) చేయట్లేదని వస్తున్న వార్తలను డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కన్ఫామ్ చేశారు. ‘పర్సనల్ రీజన్స్ దృష్ట్యా సుశాంత్ యాక్ట్ చేయట్లేదని తెలిసి బాధ పడ్డాను. సుశాంత్ లేకపోవచ్చు కానీ కార్తిక్ ఉంటాడు. అదే ప్రపంచాన్ని అవే క్యారెక్టర్స్ని మీ ముందుకు తీసుకొస్తాం. నా కాస్ట్, క్రూని నమ్ముతున్నాను. మీరు నాపై నమ్మకం ఉంచండి కుర్రాళ్లు ఇరగదీస్తారు’ అని తెలిపారు.
News January 22, 2026
AI ప్రయోజనాలు అందరికీ అందాలి: చంద్రబాబు

ప్రభుత్వ సేవలను మెరుగు పరిచేందుకు AIని వినియోగిస్తున్నట్లు CM చంద్రబాబు పేర్కొన్నారు. దావోస్లో AIపై నిర్వహించిన సెషన్లో ప్రసంగించారు. ‘AI కేవలం టెక్ కంపెనీలు, సిటీలకే పరిమితం కాకుడదు. ప్రతి పౌరుడు, రైతులు, విద్యార్థులు, ఎంటర్పెన్యూర్స్ అందరికీ దాని బెనిఫిట్స్ దక్కాలి’ అని తెలిపారు. మరో సెషన్లో రాష్ట్రంలో న్యాచురల్ ఫార్మింగ్ కోసం 20లక్షల ఎకరాలు, 18లక్షల మంది రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.


