News February 11, 2025

నేడు వైసీపీ నేతలతో జగన్ సమావేశం

image

AP: ఇవాళ వైసీపీ ముఖ్య నేతలతో మాజీ సీఎం జగన్ తాడేపల్లిలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి పార్టీ జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలు హాజరవుతారు. పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అలాగే జగన్ జిల్లాల టూర్‌పై కూడా ఈ సమావేశంలో స్పష్టత వస్తుందని సమాచారం. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలపై నేతలతో జగన్ చర్చిస్తారు.

Similar News

News December 3, 2025

సమంత-రాజ్.. కొత్త ఫొటోలు చూశారా?

image

హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు వివాహ బంధంలోకి అడుగుపెట్టడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. సమంత మెహిందీ వేడుకకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఆమె నవ్వుతూ చేతులు చూపిస్తుండగా, రాజ్ ఫొటోలు తీశారు. సమంత క్లోజ్ ఫ్రెండ్ ఒకరు వీటిని SMలో పోస్ట్ చేశారు. ‘సమంత.. ఈ పెళ్లితో నీలో కొత్త రకమైన సంతోషాన్ని చూస్తున్నా. మీరిద్దరూ ఇలాగే కలకాలం కలిసుండాలి’ అని పేర్కొన్నారు.

News December 3, 2025

DCM అంటే దిష్టి చుక్క మంత్రి.. పవన్‌పై YCP సెటైర్లు

image

AP: కోనసీమ దిష్టి వివాదం నేపథ్యంలో Dy.CM పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పొద్దున లేస్తే హైదరాబాద్‌లోనే ఉండే ఆయన తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని హితవు పలుకుతున్నారు. అప్పుడప్పుడు ఏపీకి వచ్చే ఆయన ఇటీవల కోనసీమలో వెకేషన్ కోసం పర్యటించారని సెటైర్లు వేస్తున్నారు. డిప్యూటీ సీఎం(DCM) అంటే దిష్టి చుక్క మంత్రి అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

News December 3, 2025

పడింది ఒకే బాల్.. వచ్చింది 10 రన్స్

image

IND-RSA మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆసక్తికర ఘటన జరిగింది. ప్రసిద్ధ్ వేసిన 37వ ఓవర్ తొలి బంతికి బ్రేవిస్ సిక్స్ కొట్టారు. తర్వాతి బంతి వైడ్ కాగా అనంతరం నో బాల్ ప్లస్ 2 రన్స్ వచ్చాయి. దీంతో ఒకే బాల్ కౌంట్ అవగా 10 రన్స్ స్కోర్ బోర్డుపై చేరాయి. అటు మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం సౌతాఫ్రికా స్కోర్ 42 ఓవర్లకు 299/4. ఆ జట్టు విజయానికి 60 రన్స్, IND గెలుపునకు 6 వికెట్లు కావాలి.