News April 6, 2024

ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకున్న జగన్: లోకేశ్

image

AP: సీఎం జగన్ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రాన్ని నట్టేట ముంచారని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. ‘టీడీపీ హయాంలో నెలాఖరునే జీతాలు చెల్లించారు. కానీ ఈ ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు పడతాయో చెప్పలేం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగుల బకాయిలు విడతల వారీగా చెల్లిస్తాం. 2019లో ఆగిపోయిన అభివృద్ధిని.. అక్కడి నుంచే తిరిగి కొనసాగిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News February 5, 2025

రాష్ట్రంలో ఠారెత్తిస్తున్న ఎండలు

image

TG: రాష్ట్రంలో ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో 32 నుంచి 36 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతూ వేసవిని తలపిస్తోంది. వాతావరణంలో తేమశాతం తగ్గడంతో ఎండలు కాస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో వారంపాటు ఇవే ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా వేసింది. మరోవైపు హైదరాబాద్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. మీ ఏరియాలో ఎండలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News February 5, 2025

Way2Newsలో ఎక్స్‌క్లూజివ్‌గా ఎగ్జిట్ పోల్స్

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కానున్నాయి. ఢిల్లీ పీఠం ఎవరిదనే దానిపై యాక్సిస్ మై ఇండియా, సీ ఓటర్, జన్ కీ బాత్, టుడేస్ చాణక్య వంటి సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించనున్నాయి. Way2Newsలో వేగంగా, ఎక్స్‌క్లూజివ్‌గా ఎగ్జిట్ పోల్స్ తెలుసుకోవచ్చు.

News February 5, 2025

కనిపించని కళాఖండానికి రూ.15లక్షలు!

image

కంటికి అద్భుతంగా కనిపించే కళాఖండాన్ని రూ.కోట్లు పెట్టి కొనుగోలు చేయడం చూస్తుంటాం. కానీ, అసలు భౌతికంగా లేని ఓ ఆర్ట్‌ను $18,300 (రూ.15లక్షలు)కు కొనుగోలు చేశారు. ఇటాలియన్ కళాకారుడు సాల్వటోర్ గరౌ భౌతికంగా కనిపించని శిల్పాన్ని రూపొందించారు. అయితే ఇది భౌతికంగా కనిపించనప్పటికీ అక్కడ ఏదో రూపం ఉందనే భావనే కలుగుతోందని చెప్పుకొచ్చారు. దీనిని విక్రయించేందుకు వేలం నిర్వహించగా భారీ డిమాండ్ కనిపించింది.

error: Content is protected !!