News April 6, 2024
ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకున్న జగన్: లోకేశ్
AP: సీఎం జగన్ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రాన్ని నట్టేట ముంచారని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. ‘టీడీపీ హయాంలో నెలాఖరునే జీతాలు చెల్లించారు. కానీ ఈ ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు పడతాయో చెప్పలేం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగుల బకాయిలు విడతల వారీగా చెల్లిస్తాం. 2019లో ఆగిపోయిన అభివృద్ధిని.. అక్కడి నుంచే తిరిగి కొనసాగిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 26, 2025
పక్క రాష్ట్రానికి 5 ఇచ్చినప్పుడు మాకు నాలుగైనా ఇవ్వాలి కదా?: రేవంత్
TG: ‘పద్మ’ అవార్డుల ప్రకటనలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపించిందని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి విమర్శించారు. ‘పక్క రాష్ట్రానికి ఐదు అవార్డులు ఇచ్చినప్పుడు మాకు ఒకటి తక్కువతో నాలుగు ఇచ్చినా రాష్ట్ర పెద్దలందరికీ గౌరవం దక్కేది. తొందర్లోనే దీనిపై ప్రధానికి లేఖ రాయబోతున్నా. అన్యాయం జరిగినప్పుడు నిరసన తెలపాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రజాస్వామ్యయుతంగా తెలియజేస్తాం’ అని వెల్లడించారు.
News January 26, 2025
ఆ ప్రచారం నమ్మొద్దు.. ‘RC 16’ టీమ్
రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో ‘RC 16’ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న సినిమాకు ఆస్కార్ విన్నర్ AR రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి రెహ్మాన్ తప్పుకొన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన టీమ్ ఇందులో వాస్తవం లేదంది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని అభిమానులకు సూచించింది. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.
News January 26, 2025
నేడు మధ్యప్రదేశ్కు సీఎం రేవంత్
TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రి మధ్యప్రదేశ్కు వెళ్లనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో అంబేడ్కర్పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్లోని డాక్టర్ అంబేడ్కర్ నగర్లో నిర్వహించనుంది. ‘సంవిధాన్’ పేరిట రేపు జరిగే ఆ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.