News December 5, 2024
ఖజానాను ఖాళీ చేసిన జగన్: యనమల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_112024/1732439074668_695-normal-WIFI.webp)
AP: ప్రజా సమస్యలపై మాజీ సీఎం జగన్ <<14789250>>ఆందోళనలకు<<>> పిలుపునివ్వడంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు ఆయన కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఖజానాను ఖాళీ చేసిన జగన్ ప్రస్తుతం అధికారం లేకుండా ఉండలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన పాలనను ప్రజలు తిరస్కరించిన విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు.
Similar News
News January 17, 2025
సంక్రాంతి సెలవుల తర్వాత కాలేజీలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737079880560_893-normal-WIFI.webp)
TG: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు నిన్నటితో సంక్రాంతి సెలవులు ముగిశాయి. దీంతో నేటి నుంచి కాలేజీ విద్యార్థులు తరగతులకు హాజరు కానున్నారు. మరోవైపు స్కూళ్లకు సెలవులు నేటితో ముగియనుండటంతో రేపు పాఠశాలలన్నీ తిరిగి తెరుచుకోనున్నాయి. ఆదివారం వరకు సెలవులు పొడిగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. అటు ఏపీలో స్కూళ్లు 20న పునః ప్రారంభం కానున్నాయి.
News January 17, 2025
అతడి వల్లే భారత్ ఓడిపోయింది: అశ్విన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737074551552_367-normal-WIFI.webp)
BGTలో టీమ్ ఇండియా ఓడిపోవడానికి ఆస్ట్రేలియా బౌలర్ బోలాండే కారణమని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. ‘కమిన్స్ అద్భుతంగా రాణించారని అందరూ అంటున్నారు. కానీ అతడు లెఫ్ట్ హ్యాండర్లకు బౌలింగ్ వేసేటప్పుడు ఇబ్బంది పడ్డారు. బోలాండ్ టీంలోకి రావడం ఆస్ట్రేలియా అదృష్టం. అతడు లేకుంటే భారత్ గెలిచేది’ అని చెప్పారు. కాగా హేజిల్వుడ్కు గాయం కావడంతో బోలాండ్ టీంలోకి వచ్చి 3 టెస్టుల్లో 21 వికెట్లు తీశారు.
News January 17, 2025
కోటి దాటిన టీడీపీ సభ్యత్వాలు.. లోకేశ్ ట్వీట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737078526070_367-normal-WIFI.webp)
AP: TDP సభ్యత్వాలు కోటి దాటినందుకు మంత్రి లోకేశ్ స్పెషల్ ట్వీట్ చేశారు. ‘రికార్డులు సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా టీడీపీ కార్యకర్తలకే సాధ్యం. పీక మీద కత్తి పెట్టి వేరే పార్టీ అధినేతకు జై కొడితే విడిచిపెడతామని చెప్పినా జై చంద్రబాబు, జై టీడీపీ అంటూ ప్రాణత్యాగం చేసిన చంద్రయ్య నాకు ప్రతి క్షణం గుర్తొస్తారు. కార్యకర్తల అభిప్రాయాలను గౌరవించే ఒకే ఒక్క పార్టీ టీడీపీ’ అని ట్వీట్ చేశారు.