News April 25, 2024
జగన్పై దాడి కేసు.. సతీశ్కు పోలీస్ కస్టడీ

AP: సీఎం జగన్పై రాయితో దాడి చేసిన కేసులో నిందితుడు సతీశ్ను పోలీస్ కస్టడీకి ఇస్తూ విజయవాడ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో A1గా ఉన్న ఆయన్ను 3 రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల 27 వరకు పోలీసులు సతీశ్ను విచారించనున్నారు. లాయర్ సమక్షంలో అతడిని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే విచారించాలని.. థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది.
Similar News
News March 16, 2026
శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

AP: నంద్యాల(D)లోని శ్రీశైల మహా క్షేత్రంలో నేటి నుంచి 20వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి వరుసగా భృంగి, కైలాస, నంది, అశ్వ వాహన సేవలు నిర్వహిస్తారు. అమ్మవారు మహాలక్ష్మి, మహాదుర్గ, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, నిజరూప అలంకారాల్లో దర్శనమిస్తారు. ఈ 5 రోజులపాటు గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
News March 16, 2026
భారత్కు గుడ్ న్యూస్.. గ్యాస్ కష్టాలు తీరనున్నాయ్

హార్ముజ్ జలసంధిలో అడ్డంకులను దాటుకున్న శివాలిక్ నౌక గుజరాత్లోని ముంద్రా పోర్టుకు కొన్ని గంటల్లో చేరుకోనుంది. ఇందులో దాదాపు 40-46 వేల మెట్రిక్ టన్నుల LPG ఉంది. దీని రాకతో దేశంలో గ్యాస్ కష్టాలు కొంత వరకు తగ్గనున్నాయి. 46వేల మెట్రిక్ టన్నుల LPGతో ‘నందా దేవి’ అనే నౌక కూడా అతి త్వరలో భారత్కు చేరుకోనుంది. దీనికి ఇండియన్ నేవీ ఎస్కార్ట్ కల్పిస్తోంది.
News March 16, 2026
టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం

ఏపీ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.30 గంటల లోపే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. ఆలస్యమైన స్టూడెంట్స్ను ప్రత్యేక పరిస్థితుల్లో 10 గంటలవరకు అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరగనుంది.


