News October 30, 2024
రైతు సమస్యలపై జగన్ మొసలి కన్నీరు: MLA జీవీ

AP: రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్కు లేదని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. ఉచిత పంటల బీమా పేరిట రైతులను జగన్ ముంచారని దుయ్యబట్టారు. రైతు సమస్యలపై ఆయన మొసలి కన్నీరు మానుకోవాలని చురకలంటించారు. బీమా సంస్థలకు రూ.1300 కోట్లకు పైగా బకాయిలు పెట్టి, వాటిని మేం కట్టాలనడం శోచనీయమని అన్నారు. సాగును అస్తవ్యస్తం చేసిన జగన్ రైతులను ఆత్మహత్య ఊబిలోకి నెట్టారని ఫైర్ అయ్యారు.
Similar News
News December 31, 2025
iBomma కేసు: నార్మల్ ప్రింట్కు $100.. HD ప్రింట్కు $200!

ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. రిపోర్ట్ ప్రకారం.. రవి రెండు రకాలుగా సినిమా ప్రింట్ను కొన్నాడు. నార్మల్ ప్రింట్కు $100.. HD ప్రింట్కు $200 చెల్లించాడు. తన 7 ఖాతాలకు ₹13.40 కోట్లు వచ్చాయి. బెట్టింగ్, యాడ్ల ద్వారా ₹1.78 కోట్లు అందాయి. సోదరి చంద్రికకు రవి ₹90 లక్షలు పంపాడు. రాకేశ్ అనే వ్యక్తి ద్వారా ట్రేడ్ మార్క్ లైసెన్స్ పొందాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేశాడు.
News December 31, 2025
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ఉదయమే సానుకూలంగా ప్రారంభమైన indices అంతకంతకూ పెరుగుతూ ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేస్తున్నాయి. సెన్సెక్స్ 429 పాయింట్ల లాభంతో 85,104 వద్ద.. నిఫ్టీ 154 పాయింట్లు పెరిగి 26,092 దగ్గర ట్రేడవుతోంది. టాటా స్టీల్, పవర్ గ్రిడ్, రిలయన్స్, ట్రెంట్, టైటాన్ షేర్లు లాభాల్లో.. TCS, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫీ, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
News December 31, 2025
2025: ESPN వన్డే, టీ20, టెస్ట్ టీమ్స్ ఇవే

ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో టెస్ట్, వన్డే, టీ20 టీమ్స్ను ESPNCRICINFO ప్రకటించింది. టెస్టుల్లో భారత్ నుంచి రాహుల్, గిల్, జడేజా, సిరాజ్, వన్డేల్లో రోహిత్, కోహ్లీ, టీ20ల్లో అభిషేక్, వరుణ్, బుమ్రాను ఎంపిక చేసింది. వన్డేలకు రోహిత్, టెస్టులకు బవుమా, టీ20లకు పూరన్కు కెప్టెన్గా సెలక్ట్ చేసింది. అటు వన్డే, T20ల్లో మహిళా టీమ్స్నూ ప్రకటించింది. పూర్తి టీమ్స్ కోసం పైన స్వైప్ చేయండి.


