News October 30, 2024

రైతు సమస్యలపై జగన్ మొసలి కన్నీరు: MLA జీవీ

image

AP: రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్‌కు లేదని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. ఉచిత పంటల బీమా పేరిట రైతులను జగన్ ముంచారని దుయ్యబట్టారు. రైతు సమస్యలపై ఆయన మొసలి కన్నీరు మానుకోవాలని చురకలంటించారు. బీమా సంస్థలకు రూ.1300 కోట్లకు పైగా బకాయిలు పెట్టి, వాటిని మేం కట్టాలనడం శోచనీయమని అన్నారు. సాగును అస్తవ్యస్తం చేసిన జగన్ రైతులను ఆత్మహత్య ఊబిలోకి నెట్టారని ఫైర్ అయ్యారు.

Similar News

News November 22, 2025

త్వరలో లెక్చరర్ పోస్టుల భర్తీ: లోకేశ్

image

AP: వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 4,300 అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తామని, త్వరలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. విద్యార్థి, యువజన సంఘాల నాయకులతో భేటీలో ఈమేరకు హామీ ఇచ్చారు. కాలేజీలు, వర్సిటీల్లో రాజకీయ ప్రసంగాలకు అనుమతించబోమని తేల్చి చెప్పారు. విద్యాసంస్థల పనివేళలు పూర్తయిన తర్వాత రాజకీయేతర సమస్యలు చెప్పుకోవడానికి ప్రత్యేక వేదికపై అవకాశం కల్పిస్తామన్నారు.

News November 22, 2025

త్వరలో లెక్చరర్ పోస్టుల భర్తీ: లోకేశ్

image

AP: వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 4,300 అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తామని, త్వరలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. విద్యార్థి, యువజన సంఘాల నాయకులతో భేటీలో ఈమేరకు హామీ ఇచ్చారు. కాలేజీలు, వర్సిటీల్లో రాజకీయ ప్రసంగాలకు అనుమతించబోమని తేల్చి చెప్పారు. విద్యాసంస్థల పనివేళలు పూర్తయిన తర్వాత రాజకీయేతర సమస్యలు చెప్పుకోవడానికి ప్రత్యేక వేదికపై అవకాశం కల్పిస్తామన్నారు.

News November 21, 2025

మరికొన్ని గంటల్లో భారీ వర్షం

image

AP: బంగాళాఖాతంలో రేపు <<18351099>>అల్పపీడనం<<>> ఏర్పడనున్న నేపథ్యంలో అర్ధరాత్రి నుంచి రేపు ఉ.9 గంటల వరకు తిరుపతి, నెల్లూరులో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. రేపు మధ్యాహ్నానికి చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాలకూ వర్షాలు విస్తరించే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా నిన్న అర్ధరాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షం దంచికొట్టిన విషయం తెలిసిందే.