News February 17, 2025

ఐదేళ్ల పాలనలో జగన్ ఆర్థిక విధ్వంసం: లోకేశ్

image

AP: రాష్ట్రంలో YCP ఐదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసంతో పాటు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రులందరూ కలిపి 58 ఏళ్ల పాటు చేసిన అప్పుపై రూ.14,155 కోట్లు వడ్డీ చెల్లిస్తుండగా జగన్ పాలన ముగిసే నాటికి రూ.24,944 కోట్లకు చేరిందని తెలిపారు. 2019 వరకు ఉన్న ముఖ్యమంత్రులు చేసిన అప్పుపై కట్టిన వడ్డీ కంటే జగన్ చేసిన అప్పుపై చెల్లించే వడ్డీనే రూ.11 వేల కోట్లు అధికమన్నారు.

Similar News

News November 24, 2025

ముంబైలో “పాతాళ్ లోక్” నెట్‌వర్క్‌

image

ముంబైని ‘ట్రాఫిక్ ఫ్రీ’ నగరంగా తీర్చిదిద్దేందుకు MH ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ముంబైలో భారీ టన్నెల్‌ నెట్‌వర్క్‌ నిర్మిస్తామని CM దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు. ఈ టన్నెల్‌ నెట్‌వర్క్‌ ఇప్పటికే ఉన్న రోడ్లతో ప్యారలల్‌గా ఉంటుందని తెలిపారు. ఈ సొరంగ మార్గాన్ని ఫేమస్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘పాతాళ్ లోక్’తో ఫడణవీస్ పోల్చారు. ఈ నెట్ వర్క్‌తో ముంబై ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని చెప్పారు.

News November 24, 2025

3 సిక్సులు కొట్టడమే గొప్ప!

image

పాకిస్థాన్‌కు చెందిన జీరో స్టూడియోస్‌ ఆ దేశ క్రికెటర్‌ సాహిబ్జాదా ఫర్హాన్‌పై “Hero in the Making” అనే డాక్యుమెంటరీ తీసింది. దానికి అసలు కారణం ఏంటంటే ఆసియా కప్‌ 2025లో అతను బుమ్రా బౌలింగ్‌లో 3 సిక్సులు కొట్టడమే. కాగా ఆసియా కప్‌లో భారత్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల్లోనూ పాక్‌ ఓడిపోవడం తెలిసిందే. దీంతో ‘3 సిక్సులు కొట్టడాన్నే వీళ్లు సక్సెస్‌గా ఫీల్ అవుతున్నారు’ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

News November 24, 2025

భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 156 పోస్టులు

image

HYDలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (<>BDL<<>>) 156 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి డిసెంబర్ 8 వరకు అప్లై చేసుకోవచ్చు. www.apprenticeshipindia.gov.in పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్ కాపీని డిసెంబర్ 12లోపు పంపాలి. టెన్త్, ఐటీఐలో సాధించిన మార్కులు, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bdl-india.in/