News February 17, 2025

ఐదేళ్ల పాలనలో జగన్ ఆర్థిక విధ్వంసం: లోకేశ్

image

AP: రాష్ట్రంలో YCP ఐదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసంతో పాటు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రులందరూ కలిపి 58 ఏళ్ల పాటు చేసిన అప్పుపై రూ.14,155 కోట్లు వడ్డీ చెల్లిస్తుండగా జగన్ పాలన ముగిసే నాటికి రూ.24,944 కోట్లకు చేరిందని తెలిపారు. 2019 వరకు ఉన్న ముఖ్యమంత్రులు చేసిన అప్పుపై కట్టిన వడ్డీ కంటే జగన్ చేసిన అప్పుపై చెల్లించే వడ్డీనే రూ.11 వేల కోట్లు అధికమన్నారు.

Similar News

News November 12, 2025

‘పెద్ది’ సినిమాలో సీనియర్ నటి?

image

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’లో సీనియర్ నటి శోభన కీలకపాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. డైరెక్టర్ బుచ్చిబాబు ఆమెను సంప్రదించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రూరల్ స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. జగపతిబాబు, శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

News November 12, 2025

కష్టాలు ఎన్ని రకాలంటే..?

image

మనుషులు పడే కష్టాలను వేదాలు 3 రకాలుగా వర్గీకరించాయి. అందులో మొదటిది ఆధ్యాత్మిక దుఖాలు. శరీరంలో కలిగే రోగాలు, కోపం, కపటం, బద్ధకం వల్ల అంతర్గతంగా ఏర్పడతాయి. రెండవది ఆది భౌతిక దుఃఖాలు. ఇవి పంచభూతాలు, శత్రువులు, జంతువులు, కీటకాల వంటి బయటి జీవుల వల్ల కలుగుతాయి. మూడవది ఆది దైవిక దుఃఖాలు. ఇవి ప్రకృతి శక్తులైన అతివృష్టి, అనావృష్టి, పిడుగులు, గ్రహబాధల వల్ల సంభవిస్తాయి. వీటిని దాటడమే మోక్షం. <<-se>>#VedikVibes<<>>

News November 12, 2025

లడ్డూ తయారీలో కల్తీ నెయ్యికి అవకాశమే లేదు: YCP

image

AP: తమ హయాంలో తిరుమల శ్రీవారి వైభవాన్ని పెంచేలా నిర్ణయాలు తీసుకున్నాం తప్ప ఎలాంటి తప్పూ చేయలేదని వైసీపీ ట్వీట్ చేసింది. ‘లడ్డూ తయారీలో కల్తీ నెయ్యికి అవకాశమే లేదు. కావాలంటే రికార్డులు చూసుకోండి. సిట్ విచారణలో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి క్లారిటీగా సమాధానం ఇచ్చారు. కల్తీ నెయ్యి అంటూ గగ్గోలు పెట్టిన పచ్చమంద సైలెంట్ అయింది’ అని విమర్శించింది.