News February 17, 2025
ఐదేళ్ల పాలనలో జగన్ ఆర్థిక విధ్వంసం: లోకేశ్

AP: రాష్ట్రంలో YCP ఐదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసంతో పాటు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రులందరూ కలిపి 58 ఏళ్ల పాటు చేసిన అప్పుపై రూ.14,155 కోట్లు వడ్డీ చెల్లిస్తుండగా జగన్ పాలన ముగిసే నాటికి రూ.24,944 కోట్లకు చేరిందని తెలిపారు. 2019 వరకు ఉన్న ముఖ్యమంత్రులు చేసిన అప్పుపై కట్టిన వడ్డీ కంటే జగన్ చేసిన అప్పుపై చెల్లించే వడ్డీనే రూ.11 వేల కోట్లు అధికమన్నారు.
Similar News
News April 10, 2026
మెలానియా ప్రకటన.. టైమింగ్ వెనక పెద్ద ప్లాన్?

మెలానియా సడన్గా ఎప్స్టీన్ గురించి <<19611865>>మాట్లాడటం<<>> వెనక అనేక థియరీలు వినిపిస్తున్నాయి. ఆమె ప్రసంగంలో ఎక్కడా ట్రంప్ను సమర్థించకపోవడంతో విడాకుల రూమర్లు వస్తున్నాయి. మరోవైపు ఇరాన్ యుద్ధంలో ట్రంప్ విఫలమవుతుండటంతో ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ ప్లాన్ చేశారనే వాదనలు ఉన్నాయి. త్వరలో విడుదల కానున్న ఎప్స్టీన్ రహస్య ఈమెయిల్స్ ద్వారా ఏదైనా పెద్ద విషయం బయటకొస్తుందనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
News April 10, 2026
మెలానియా ప్రకటన.. టైమింగ్ వెనక పెద్ద ప్లాన్?

మెలానియా సడన్గా ఎప్స్టీన్ గురించి <<19611865>>మాట్లాడటం<<>> వెనక అనేక థియరీలు వినిపిస్తున్నాయి. ఆమె ప్రసంగంలో ఎక్కడా ట్రంప్ను సమర్థించకపోవడంతో విడాకుల రూమర్లు వస్తున్నాయి. మరోవైపు ఇరాన్ యుద్ధంలో ట్రంప్ విఫలమవుతుండటంతో ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ ప్లాన్ చేశారనే వాదనలు ఉన్నాయి. త్వరలో విడుదల కానున్న ఎప్స్టీన్ రహస్య ఈమెయిల్స్ ద్వారా ఏదైనా పెద్ద విషయం బయటకొస్తుందనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
News April 10, 2026
తమిళనాడు ఎన్నికల్లో తెలుగోళ్ల హవా!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్లు కీలక పాత్ర పోషించనున్నారు. 2011 లెక్కల ప్రకారం అక్కడి జనాభాలో 33.4%, మొత్తం 5.6 కోట్ల ఓటర్లలో 1.4 కోట్ల మంది మన వాళ్లే. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరు తెలుగు వ్యక్తే. దీంతో వీళ్లు ఎటు వైపు నిలుస్తారనేది ఆసక్తికరం. అధికార DMK 17 మంది, ప్రతిపక్ష AIADMK 22 మంది తెలుగు అభ్యర్థులను బరిలో నిలిపాయి. 234 సీట్లున్న TN అసెంబ్లీకి ఈనెల 23న ఎన్నికలు జరగనున్నాయి.


