News January 29, 2025
జగన్ బంధువుకు అక్రమంగా అనుమతిచ్చారు: మంత్రి కొల్లు

AP: YS జగన్ బంధువు YS వెంకట్ రెడ్డి బెరైటీస్ గనుల లీజ్ ఎగ్జిక్యూషన్ నిలుపుదల చేయడంతో పాటు లీజు మంజూరు డీవియేషన్స్ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ‘YSR జిల్లా వేములలో వైట్ బెరైటీస్ లీజ్ ఆర్డర్ను ఇచ్చారు. క్వారీ లీజు అనుమతి గనులశాఖ డైరెక్టర్ పరిధిలో ఉంటుంది. గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకట్రెడ్డి గతంలో అక్రమంగా అనుమతిచ్చారు. వాటిని రద్దు చేస్తాం’ అని కొల్లు చెప్పారు.
Similar News
News February 15, 2025
‘స్థానిక’ ఎన్నికలు.. ఇవాళ పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల

TG: ఒకవైపు బీసీలకు 42% రిజర్వేషన్లపై క్లారిటీ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండగా మరోవైపు అధికారులు ఎలక్షన్స్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. 570 ZPTC, 5,817 MPTC స్థానాల్లోని పోలింగ్ కేంద్రాల జాబితాను ఇవాళ ప్రకటించాలని సూచించారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణను పూర్తి చేయాలన్నారు.
News February 15, 2025
బైక్ నడుపుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి

*రోడ్లపై స్పీడ్ లిమిట్ ఫాలో అవ్వండి
*ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేయొద్దు
*స్లోగా వెళ్లేవారు ఎడమవైపు వెళ్లాలి. కుడి వైపు నుంచి ఓవర్ టేక్ చేయాలి.
*ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి లో క్వాలిటీ హెల్మెట్లు వాడతారు. వీటి వల్ల మన ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. అందుకే ISI మార్క్ ఉన్న క్వాలిటీ హెల్మెట్ వాడాలి.
*బైక్ నడుపుతూ సెల్ ఫోన్ వాడొద్దు.
*రాత్రి వేళల్లో ప్రయాణాలు వద్దు.
News February 15, 2025
పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహకాలు: CM

TG: రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడమే కాకుండా యువతకు ఉపాధి కల్పించే వనరుగా పర్యాటక శాఖ ప్రణాళికలు ఉండాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. TG చరిత్రను వర్తమానానికి అనుసంధానిస్తూ భవిష్యత్కు బాటలు వేసేలా శాఖను తీర్చిదిద్దాలన్నారు. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ఆలయాలు, పర్యాటక ప్రాంతాలపై ప్రచారం చేయాలని సూచించారు.