News March 19, 2024

ప్రొద్దుటూరులో జగన్ ‘మేమంతా సిద్ధం’ సభ: సజ్జల

image

AP: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ బస్సు యాత్ర చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 27 నుంచి ఇడుపులపాయలో బస్సు యాత్ర ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘సిద్ధం సభలు జరిగిన నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల యాత్రలు ఉంటాయి. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జగన్ ‘మేమంతా సిద్ధం’ సభ ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.

Similar News

News August 28, 2025

బాలకృష్ణ ‘అఖండ 2’ రిలీజ్ వాయిదా

image

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న ‘అఖండ 2’ మూవీ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు పెండింగ్ ఉండటంతో పోస్ట్‌పోన్ చేయక తప్పడం లేదని వివరించింది. తదుపరి విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

News August 28, 2025

US టారిఫ్స్‌కు GSTతో చెక్: BMI

image

ఇండియాపై US టారిఫ్స్ ప్రభావం పరిమితమేనని బిజినెస్ మానిటర్ ఇంటర్నేషనల్ అభిప్రాయపడింది. ‘ఈ దశాబ్దం చివరికి IND GDP 6%పైనే ఉంటుంది. 2010-19 యావరేజ్(6.5%)తో పోలిస్తే కొంతే తక్కువ. అయినా ASIAలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీస్‌లో INDనే టాప్. GST 2శ్లాబుల విధానం, ఆదాయపన్ను కోతలతో కొనుగోళ్లు రూ.5.31 లక్షల కోట్లకు చేరుతాయని SBI అంచనా. ఇవన్నీ గ్రోత్‌పై టారిఫ్స్‌ ప్రభావాన్ని తగ్గిస్తాయి’ అని తెలిపింది.

News August 28, 2025

బీస్ట్ మోడ్‌లో సంజూ శాంసన్.. మరో ఫిఫ్టీ

image

KCLలో కొచ్చి బ్లూ టైగర్స్‌ ప్లేయర్ సంజూ శాంసన్ మరోసారి రెచ్చిపోయారు. అదానీ త్రివేండ్రం రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచులో సంజూ మరో ఫిఫ్టీ బాదారు. 37 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 62 పరుగులు సాధించారు. కాగా అంతకుముందు త్రిస్సూర్ టైటాన్స్‌పై 89, కొల్లం సెయిలర్స్‌పై 121 పరుగులు బాదిన విషయం తెలిసిందే. తాజా ఫామ్‌తో శాంసన్ టీమ్ ఇండియా ఓపెనర్ స్థానానికి గట్టి పోటీ ఇస్తున్నారు.