News April 14, 2025
విద్యార్థులతో ‘జైశ్రీరామ్’ నినాదాలు.. కొత్త వివాదంలో TN గవర్నర్

తమిళనాడు గవర్నర్ R.N.రవిపై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. మధురైలోని ఓ కళాశాల విద్యార్థులతో ‘జైశ్రీరామ్’ నినాదాలు చేయించారు. మతాలకు అతీతమైన పదవిలో ఉండి ఇలా చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. ఆయన్ను వెంటనే రీకాల్ చేయాలని DMK, కాంగ్రెస్, CPI నేతలు డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా, లౌకికవాదానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
Similar News
News October 17, 2025
భారత్తో సిరీస్.. ఆసీస్ కీలక ప్లేయర్ ఔట్

భారత్తో వన్డే సిరీస్కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ కండరాల నొప్పితో సిరీస్కు దూరమయ్యారు. అతని స్థానంలో మార్నస్ లబుషేన్ను ఎంపిక చేశారు. ఈ నెల 19న తొలి వన్డే పెర్త్లో, 23న రెండోది అడిలైడ్, మూడో వన్డే 25న సిడ్నీలో జరగనుంది. మొదటి మ్యాచ్ పెర్త్లో జరగనుండగా, అక్కడి బౌన్సీ పిచ్ మన బ్యాటర్లకు సవాలు విసరనుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
News October 17, 2025
అన్నింటా రాణిస్తున్న అతివలు

ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఆడవాళ్లు తమ ముద్ర వేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో తామూ ముందుంటామంటున్నారు. తాజాగా హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో 77వ రెగ్యులర్ రిక్రూట్ బ్యాచ్లో 174 మంది ఈసారి ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో 62 మంది అమ్మాయిలే. ఇండియన్ పోలీస్ సర్వీస్ చరిత్రలో ఇది ఒక రికార్డుగా చెప్పవచ్చు. 73వ బ్యాచ్లో 20.66% ఉన్న ఈ సంఖ్య, ఈసారి 35% పైగా పెరగడం గమనార్హం.
News October 17, 2025
23న క్యాబినెట్ భేటీ.. బీసీ రిజర్వేషన్లపై ప్రకటన?

TG: BC రిజర్వేషన్లపై నిన్న సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో క్యాబినెట్ భేటీలో కీలక ప్రతిపాదన చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ పరంగానే BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని మెజార్టీ మంత్రులు సీఎం రేవంత్కు సూచించినట్లు సమాచారం. దీనిపై ఈనెల 19న TPCC పీఏసీ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం 23న క్యాబినెట్ మరోసారి సమావేశమై అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.